ఓవెల్ జూనియర్ కాలేజీలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని ఓవెల్ జూనియ‌ర్ క‌ళాశాల‌లో… 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఓవెల్ విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ రంగిశెట్టి వేణు జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. స్వాతంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని… క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన సాంస్కృతి కార్య‌క్ర‌మాలు, అధ్యాప‌కులు, విద్యార్థుల ఉప‌న్యాసాలు విద్యార్థుల‌కి స్ఫూర్తిని క‌లిగించేలా అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. అనంత‌రం చైర్మ‌న్ వేణు మీడియాతో మాట్లాడారు. ఎంద‌రో దేశ‌భ‌క్తుల కృషి ఫ‌లితంగానే స్వాతంత్యం పొందామ‌ని గుర్తు…

Read More

ఎంద‌రో మ‌హానుభావుల త్యాగ‌ఫ‌లిత‌మే స్వాతంత్య్రం

నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో అట్టహాసంగా 78వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు గురువారం ఉద‌యం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ వేడుక‌ల‌కి…రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్‌ పొంగూరు నారాయణ విచ్చేశారు. ముందుగా మంత్రికి క‌లెక్ట‌ర్ ఆనంద్‌, ఎస్పీ కృష్ణ‌కాంత్‌, క‌మిష‌న‌ర్ సూర్య‌తేజ‌లు పుష్ప‌గుచ్చం అంద‌చేసి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం మంత్రి, జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్‌, ఎస్పీ కృష్ణ‌కాంత్‌లు పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి…

Read More

బుచ్చిలో అంబ‌రాన్నింటిన పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. అన్ని కార్యాలయాల ముందు జాతీయ జెండా రెపరెపలాడింది.. తహసిల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ ,పోలీస్ స్టేషన్ కార్యాల‌యాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… ఎంద‌రో స్వాతంత్ర పోరాటయోధుల పోరాటానికి పలితమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు… ఈ కార్యక్రమంలో…

Read More
sangam

సంగం పోలీసుస్టేష‌న్ల‌లో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన సీఐ, ఎస్ఐలు నెల్లూరు జిల్లా సంగం పోలీస్ స్టేషన్లో పోలీస్ ల‌లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి, నూతన సీఐ వేమారెడ్డి బదిలీ అయిన సీఐ రవి నాయక్ తో కలిసి జెండా ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం లో పోలీసు కార్యాల‌యాల సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read More
Marripadu

మ‌ర్రిపాడులో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు…

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో 78వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. తహసీల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ జె.స్వప్న, పోలీస్ స్టేషన్లో ఎస్సై విశ్వనాథరెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో మండల ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పరిమి నాగమణి,పోలీసు, రెవెన్యూ,ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది, హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Read More