SLV – D 3 రాకెట్ ప్రయోగం విజయవంతం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఉద‌యం 9 గంట‌ల 17 నిమిషాల‌కి … స్మార్ట్ సాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) -D3 విజయవంతంగా నింగిలోకి నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది. దీంతో చైర్మ‌న్‌తోపాటు శాస్త్ర‌వేత్త‌లు సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఇస్రో చైర్ చైర్మ‌న్ సోమనాథ్ మాట్లాడుతూ… షార్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు చెప్పారు, ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈవో…

Read More

నిషేధం ఉన్నా…

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయంలో చేప గుడ్డు దశలో ఉండడంతో జులై 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు చేపలు పట్టకూడదని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. అయితే కొంతమంది నిషేధాజ్ఞలు అతిక్రమించి చేపల వేట జోరుగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పట్టిన చేపలను ఇతర రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వినవొస్తున్నాయి. చేపల వేట సాగించి తరలింపుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం రావడంతో సోమశిల ఎస్ఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి దాడులు చేశారు. జలాశయం…

Read More

ఇద్ద‌రు మినిస్ట‌ర్లు భేటీ…

రాష్ట్ర మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి నారాయ‌ణ‌ రాష్ట్ర దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డితో…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం సంత‌పేట‌లోని మంత్రి ఆనం నివాసంలో…ఆయ‌న్ని మంత్రి నారాయ‌ణ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌, జిల్లా అభివృద్ధిపై ఇరువురు మంత్రులు సుదీర్ఘ‌గంగా చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నారాయ‌ణ వెంట‌…టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన…

Read More

క‌న్నుల పండువ‌గా వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం…

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యంలో వైభ‌వంగా కుంకుమార్చ‌న నెల్లూరు న‌గ‌రం ద‌ర్గామిట్ట‌లో వెల‌సి ఉన్న‌ శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యంలో… శ్రావ‌ణ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారిని వివిధ ర‌కాల పుష్పాల‌తో శోభాయ‌మానంగా అలంక‌రించారు. మ‌హిళా భ‌క్తులు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి సామూహిక లక్ష కుంకుమార్చ‌న పూజ‌లు నిర్వ‌హించారు. భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించి తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. భ‌క్తుల‌కి ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆల‌య అధికారులు ప‌టిష్ట చ‌ర్య‌లు…

Read More

పేదోడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు

పేదోడి ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు మళ్ళీ రాష్ట్రం అంతటా కూడా ఒక పండు వాతావరణం లో ప్రారంభం కావడం సంతోషక‌ర‌మ‌ని… రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 38వ డివిజన్ ఏసీ కూరగాయల మార్కెట్ దగ్గర అన్నా క్యాంటీన్ ను రాష్ట్రజనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా ఇరువురికి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ…

Read More

ఇచ్చిన మాట‌ని నిల‌బెట్టుకున్నాం…

అధికారంలోకి రాగానే…అన్న క్యాంటీన్ల‌ను పునః ప్రారంభిస్తామ‌ని…ఎన్నిక‌ల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన వాగ్ధానాన్ని నిల‌బెట్టుకున్నార‌ని… రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను నెల్లూరు పార్ల‌మెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ముందుగా మంత్రి నారాయ‌ణ‌కి స్థానిక టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు….

Read More

విద్యార్థుల్లో స్పూర్తినింపేలా..

ఆత్మకూరులో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో 78వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆత్మకూరు పట్టణంలోని ఆర్డిఓ ,డిఎస్పి ,మండల పరిషత్ మరియు మున్సిపల్ కార్యాలయాలలో ఆయా శాఖల అధికారులు జెండా వందనం చేపట్టి స్వీట్లు పరిచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు దేశభక్తి గీతాలు అలపించారు.స్వాతంత్య్ర పోరాటాలు, అమరవీరుల త్యాగాలుల‌ను విద్యార్థుల్లో స్పూర్తి నింపేలా ప్ర‌జాప్ర‌తినిధులు వివ‌రించారు. అనంత‌రం చిన్నారుల‌కు…

Read More

దుత్త‌లూరులో మువ్వెన్నెల జెండా రెప‌రెప‌లు

మండలంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దుత్తలూరు మండలంలోని పలు కార్యాలయాలలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు వై నాగరాజు, ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ.. భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్ధులు దేశ భ క్తిని పెంపొందించుకోవాలని ఆయన తెలియజేసారు. ఎరుకొల్లు పాఠశాల, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ…

Read More

డ‌క్కిలిలో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో రెప‌రెప‌లాడిన జాతీయ ప‌తాకం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ స్థానిక పోలీసుస్టేష‌న్‌, మండ‌ల రెవెన్యూ కార్యాల‌యాల్లో మువ్వెన్న‌ల జెండా రెప రెప‌లాడింది. ఈ సంద‌ర్భంగా మండ‌ల రెవెన్యూ అధికారి ఎం. శ్రీ‌నివాసులు జాతీయ జెండాను ఆవిష్క‌రించి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం శ్రీ‌నివాసులు మాట్లాడుతూ… ఎంతోమంది సమరయోధుల ప్రాణ త్యాగమేనని తెలియ‌జేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ అమ‌ర వీరుల అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌న్నారు. డక్కిలి డాక్టర్…

Read More

అల్లూరులో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

నెల్లూరు జిల్లా అల్లూరు మండ‌లంలో 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా మండ‌లంలో మువ్వెన్న‌ల జెండా రెప‌రెప‌లాడింది. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శశిరేఖ ఎంపీడీవో జ్యోతి కలిసి జండాను ఎగరవేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇటీవల నిర్వహించిన పోటీలలో విజయం సాధించిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో జ్యోతి మాట్లాడుతూ… ఎంతో మంది త్యాగమూర్తుల పోరాటపటీమే నేడు మన ఈ స్వేచ్ఛ జీవితమని గుర్తు చేశారు. అలాంటి వారిని ఆగస్టు 15…

Read More