కనీవినీ ఎరుగని రీతిలో లంబోదర సెంటర్లో చవితి వేడుకలు
నెల్లూరు నగరంలోని లంబోదర సెంటర్లో కనీవిని ఎరగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వీటిలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదర సెంటర్ లో ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లంబోదర సెంటర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐదు రోజులపాటు గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా 21 కేజీల లడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు…