
అంతా…నా ఇష్టం
ఎవరి అనుమతులు లేకుండా పాఠశాలలోని మరుగుదొడ్లు, చెట్లను సర్పంచ్ కూల్చేసిన ఘటన… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలికలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం రేగడ చేరిక ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించి ఉంది. ఈ మరుగుదొడ్లు, చెట్లు, వాటర్ ట్యాంక్లను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావుల శ్రీనివాసులు కూల్చేశాడని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమిటని…