త‌న్నుకున్న తెలుగు త‌మ్ముళ్లు

ఓ స్థ‌ల వివాదంలో…మాజీ కార్పొరేట‌ర్‌, ప్ర‌స్తుత కార్పొరేట‌ర్ వ‌ర్గాలు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలో చోటు చేసుకుంది. ఈ దాడుల్లో… 53,54 క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జి జ‌హీర్ త‌ల‌కు తీవ్ర గాయాల‌వ‌డంతోపాటు…ఇరువ‌ర్గాల వారికి ర‌క్త‌పు గాయాల‌య్యాయి. దీంతో జ‌హీర్ ని ఆయ‌న అనుచ‌రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్‌కి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి అపోలోకు త‌ర‌లించారు. అలాగే ఈ దాడుల్లో ముజీర్ వ‌ర్గం అనుచ‌రులు కూడా గాయ‌ప‌డ్డారు. వారు…

Read More

ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉదయగిరి జిల్లా ఉద్యమ గర్జన…!

హైస్కూల్ నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు భారీ ర్యాలీ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి జిల్లా సాధనే లక్ష్యంగా ఉదయగిరిలో ఉధృతం చేశారు. జిల్లా సాధన సమితి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, షేక్ దస్తగిరి అహ్మద్ సారథ్యంలో ఉదయగిరిలో హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు భారీ జన సందోహం మధ్య జానపద కళాకారుల డప్పులతో ర్యాలీగా నిర్వ‌హించారు. అనంతరం బ‌స్టాండ్ వ‌ద్ద‌ మానవహారం చేప‌ట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ… ఏళ్ల తరబడి వివక్షకు…

Read More

ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జిలో డ్రైనేజీ నీళ్లు

నెల్లూరు న‌గ‌రం ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద‌…భారీగా డ్రైనేజీ నీళ్లు చేరాయి. దీంతో అటుగా ప్ర‌యాణించే వాహ‌న‌దారులు, పాద‌చారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీళ్లు కావ‌డంతో భ‌య‌క‌రంగా దుర్వాస‌న వెద‌జ‌ల్లుతోంది. అటు వెళ్ల‌లేక ప్ర‌జ‌లు నర‌క‌యాత‌న ప‌డుతున్నారు. సాధార‌ణంగా చిన్న‌పాటి వ‌ర్షం కురిస్తేనే అండ‌ర్ బ్రిడ్జి స‌ముద్రాన్ని త‌ల‌పిస్తోంది. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నా… సంబంధిత కార్పొరేష‌న్ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాహ‌న‌దారులు వాపోతున్నారు. వెంట‌నే కార్పొరేష‌న్ అధికారులు స్పందించి…అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద నిల్వ ఉన్న…

Read More

వింజ‌మూరులో పశుగణన సర్వే ప్రారంభం

ప‌శువుల సంఖ్య‌, రైతువారి డేటా సేక‌ర‌ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు 21 వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ప్రారంభించినట్లు వింజమూరు ఏరియా పశువైద్యాధికారి డాక్టర్. రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. మండలంలోని ఉండే పశువులు సంఖ్యను, రైతువారి డేటా సమీకరించి ప్రతి గ్రామంలో ఎన్ని పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సర్వే వలన నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి కులాలు వారీగా కేంద్ర, రాష్ట్ర…

Read More

అగ్ని ప్ర‌మాద‌మా..? ఆక‌తాయిల ప‌నా…?

నెల్లూరు న‌గ‌రంలోని డీఎంహెచ్‌వో కార్యాల‌య ప్రాంగ‌ణంలో…అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దోమల మందు, దోమలకు కాలువల్లో వేసే మడ్డి ఆయిల్ నిలువ ఉంచే పాత‌ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జ‌రిగింది. దీంతో భ‌వ‌నంలో నుంచి ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌ల‌తో పాటు….మ‌డ్డి ఆయిల్ ఉండ‌డంతో పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. డీఎంహెచ్‌వో కార్యాల‌యంలో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక ప్ర‌జ‌లు ఒక్క సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి…

Read More

హైవే ప‌క్క‌న మెడిక‌ల్ వేస్ట్…

తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేటలోని జాతీయ ర‌హ‌దారి ప‌క్కన వైద్య వ్యర్థాలను ప‌డేయ‌డంతో వాహ‌న‌దారులు, ప్ర‌జ‌లు విస్మ‌యానికి గుర‌య్యారు. వాడేసిన సిరంజిలు, సూదులు, సెలైన్ బాటిళ్లు, గ్లౌజ్‌లు ఇత‌ర వ్య‌ర్ధాల‌ను ప‌డేశారు. అయితే…వాటి నుంచి వ‌స్తోన్న దుర్వాస‌న‌తో అటుగా వెళ్లే వాహ‌న దారుల‌తోపాటు…ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. వాడేసిన మెడిక‌ల్ వ్య‌ర్ధాల‌ను డంపింగ్ యార్డ్ లో వేయాల‌ని…ఇలా జ‌న సంచారంలో ప‌డేయ‌డం ఏమిట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మెడిక‌ల్ వ్య‌ర్ధాల కార‌ణంగా…ఎక్క‌డ అంటురోగాల బారిన ప‌డుతామోనని ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న వ్య‌క్తం…

Read More

కాశీ ఘాట్ ను తలపించే రీతిలో గణేష్ ఘాట్

న‌వంబ‌ర్‌ 15వ తేదీన సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని…రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియాజకవర్గ పరిధిలోని 41వ డివిజన్, గణేష్ ఘాట్ లో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను….నగర కమీషనర్ సూర్యతేజ, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న కార్తీక దీపోత్స‌వంపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి…

Read More

73 తీర్మానాలు…64 ఆమోదం

జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 73 తీర్మానాలను…

Read More

నేష‌న‌ల్ టెన్నీస్ బాల్ క్రికెట్ టీమ్ కి శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక‌

నెల్లూరు న‌గ‌రం పార్ధ‌సార‌ధి న‌గ‌ర్‌లోని శ్రీ చైత‌న్య ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ లో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బీ న‌క్ష‌త్ర సింగ్ విద్యార్థిని నేష‌న‌ల్ టెన్నీస్ బాల్‌, క్రికెట్ టీమ్ కి ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా పాఠ‌శాల యాజ‌మాన్యం ఆ విద్యార్థిని ప్ర‌త్యేకంగా అభినందించారు. స్కూల్ ఏజీఎం కొండారెడ్డి, ప్రిన్సిపాల్ ర‌జ‌నీలు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల‌లో మాన‌సిక‌, శారీర‌క ఉల్లాసానికి క్రీడ‌లు ఎంత‌గానో దోహ‌ద ప‌డుతాయ‌ని తెలిపారు. త‌మ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు చ‌దువుల‌తోపాటు… ఒత్తిడిని దూరం చేసే క్రీడ‌ల‌కు…

Read More

కాకాణి హౌస్ అరెస్ట్…

మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమిరెడ్డి అవినీతిని బట్టబయలు చేసేందుకు రైతులతో కలిసి కనుపూరు కాలువకు బయలుదేరిన కాకాణిని పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధంలో ఉంచారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకాణి నివాసానికి భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాకాణిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ విఫల యత్నం చేసి,…

Read More