మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపూరు ఎస్సై వెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో… రాపూరు సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు రాపూరు పట్టణ ప్రజలకు విద్యార్థి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనుమంతయ్య, రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరీష్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎస్సై వెంకట్ రాజేష్ మాట్లాడుతూ.. కాలేజీ విద్యార్థులు గంజాయి మాదకద్రవ్యాలకు జాగ్రత్తగా…

Read More

మ‌హిళ‌లకు ఇబ్బందిక‌లిగించే మ‌ద్యం షాపు వద్దు

ప్రజలకు ఇబ్బంది కలిగించే చోట మద్యం షాపు ఏర్పాటు చేయకూడదని కలిచేడుగ్రామ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌ద్యం షాపు వ‌ద్దంటూ.. వారంతా రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తున్నారు. అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు.. మ‌ద్యం వ్యాపారులు ఇష్టం వ‌చ్చింది చేసుకోండి అంటూ.. ఆ షాపు ప‌నిలో నిమ‌గ్న‌మై .. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు పాల‌కులు, అధికారులు సైతం ఆ గ్రామ ప్ర‌జ‌ల గోడు ప‌ట్టించుకోవ‌డంలేదు. క‌నీసం స‌మాధానం కూడా ఇవ్వ‌డంలేదు. నెల్లూరు జిల్లా…

Read More

ప్ర‌శాంతిరెడ్డికి ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో చెర‌గ‌ని ముద్ర

ధార్మిక, సేవ కార్య‌క్ర‌మాల్లో వీపీఆర్ వెనుక ఉంటూ మంచి మ‌హిళ‌గా పేరుగా తెచ్చుకున్న ప్ర‌శాంతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అతి త‌క్కువ కాలంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నార‌ని నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాల‌యంలో టిడిపి బీసీ ముదిరాజ్ సాధికార సమితి కన్వీనర్ పి ఎల్ రావు ఆధ్వర్యంలో జ‌రిగిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న…

Read More

మోపూరు భాస్క‌ర్‌నాయుడు సేవ‌లు ప్ర‌శంస‌నీయం

శివాజీ యూత్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు.. ర‌క్త‌దాత‌.. ర‌క్తదాన చైత‌న్య‌క‌ర్త డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్ నాయుడు జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నెల్లూరు న‌గ‌రంలో ని రోట‌రీక్ల‌బ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. నోవా బ్ల‌డ్ బ్యాంక్ సౌజ‌న్యంతో భారీ ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. అలాగే గార్డెన్ వ‌ర‌ల్డ్ వారి సహ‌కారంతో వంద‌లాది మొక్క‌ల‌ను పంపిణీ చేశారు. ఈసంద‌ర్భగా జిల్లాలోని ప్ర‌ముఖులు, రాజ‌కీయ‌నేత‌లు, వైద్యులు, ప్ర‌జాసంఘాల నేత‌లు, ఎన్జీవో సంఘాల ప్ర‌తినిధులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున భాస్క‌ర్‌నాయుడుని స‌త్క‌రించి.. కేక్ క‌ట్ చేయించి…..

Read More

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం

సమాజంలో ప్రమాదకరంగా మారిన డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొడదామని పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాల్లో ఎస్సైలు పిలుపునిచ్చారు. శుక్రవారం కలిగిరి, కొండాపురం, లింగ సముద్రం మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ పేరుతో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. కలిగిరిలో ఎస్సై ఉమాశంకర్, కొండాపురంలో వెంకట్రావు, లింగసముద్రంలో ఎస్సై మహబూబ్ సుభానిలు విద్యార్థులను చైతన్య పరిచారు. డ్రగ్స్ కు బానిసలవుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా…

Read More

దుకాణాల్లో సీసీ కెమెరాలు త‌ప్ప‌నిస‌రి

దుకాణాల్లో, అపార్ట్‌మెంట్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా సీసీ కెమెరాలు అమ‌ర్చుకోవాల‌ని సూళ్లూరుపేట సీఐ ముర‌ళీకృష్ణ సూచించారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట సీఐ కార్యాల‌యంలో ఎన్‌3 న్యూస్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ మేర‌కు సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారస్తులతో అవగాహన క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రతీ దుకాణంలో, అపార్ట్‌మెంట్ల‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ దుకాణ‌దారుల‌కు సూచించారు. చోరీలు నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. పోలీసుల‌కు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని సీఐ…

Read More

డిజిట‌ల్ అరెస్ట్‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి

డిజిట‌ల్ అరెస్ట్‌ల‌పై ప్ర‌జ‌లంతా అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని సూళ్లూరుపేట సీఐ ముర‌ళీకృష్ణ సూచించారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట పోలీస్‌స్టేష‌న్‌లో ఎన్‌3తో సీఐ ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అన్నీ వ‌ర్గాల ప్ర‌జ‌లు డిజిట‌ల్ అరెస్ట్‌ల వ‌ల్ల మోస‌పోతున్నార‌న్నారు. అన్‌నోన్ కాల్స్ వ‌స్తే ఎవ‌రు కూడా తీసి మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించారు. డివిజ‌ల్ అరెస్ట్‌ల వ‌ల్ల భార‌త‌దేశ వ్యాప్తంగా 8 వంద‌ల కోట్ల మోసం జ‌రిగింద‌ని చెప్పారు. ఎవ‌రికైనా పోలీస్‌స్టేష‌న్ల నుంచి కాల్ వ‌చ్చిందంటే వెంట‌నే స్థానిక పోలీసుల‌ను సంప్ర‌దించి ఫిర్యాదు చేయాల‌న్నారు….

Read More

సురేష్‌రెడ్డి సేవ‌ల‌కు తార్కాణం

ఆర్టీసీ రీజ‌న‌ల్ ఛైర్మ‌న్‌గా బీజేపీ రాష్ట్ర‌నేత స‌న్న‌పురెడ్డి సురేష్‌రెడ్డి గురువారం నెల్లూరు ఆర్టీసీ బ‌స్టాండులోని ఛైర్మ‌న్ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని గాంధీబొమ్మ నుంచి ఆర్టీసీ వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున బీజేపీ, బీజేపీ అనుబంధ సంఘాలు, టీడీపీ, జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు వేలాది మంది పాల్గొన్నారు. దారిపొడ‌వూనా.. మేళ తాళాలు, త‌ప్పెట్లు.. ద‌రువులు.. నినాదాల మ‌ధ్య భారీ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. అలాగే.. ఈ ర్యాలీలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచేలా…..

Read More

కోటపోలూరులో ఎన్.డి.ఆర్.ఎఫ్ మాక్ డ్రిల్

వరదలు, విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం కన్నా ప్రథమంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలోని కోటపోలురు గ్రామం పెద్దన్న గారి చెరువు వద్ద నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం మార్క్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అధికారులకు గురువారం ఉద‌యం నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు అవగాహన కల్పించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎన్.డి.ఆర్.ఎఫ్…

Read More

వారిని కూడా అరెస్ట్‌ చేయండి

సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారిపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిని కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వైసీపీ శ్రేణుల‌తో క‌లిసి వ‌చ్చి నెల్లూరు వేదాయ‌పాలెం పోలీస్‌స్టేష‌న్‌లో కాకాణి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన అనేకమంది అసభ్యకర పోస్టులు చేశారని కానీ…

Read More