రూర‌ల్ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కోటంరెడ్డి…

నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని పొట్టేపాలెం కలజు మీద బ్రిడ్జిని వెంటనే మంజూరు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించాలని…అధికారుల్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. నెల్లూరు రూరల్లో మూడు బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్నారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని… అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో మంజూరు అయ్యాయ‌ని…నేను పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో వాటిని ఆపేశార‌ని…

Read More

ఎంపీ అంటే లెక్క‌లేదా…అగౌరప‌రుస్తారా…

నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో…డీఆర్సీ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో వేదిక‌పై ఎంపీకి గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆయ‌న స‌భ నుంచి వెళ్లిపోయారు. వెంట‌నే ఎంపీ వేమిరెడ్డిని స‌ముదాయించేందుకు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు ప్ర‌య‌త్నించారు. నేను వెన‌క్కి రాలేన‌ని ఖ‌రాకండిగా చెప్పేసి జ‌డ్పీ నుంచి ఆయ‌న‌ వెళ్లిపోయారు. అక్క‌డే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి సైతం ఎంపీ వెంట వెళ్లిపోయారు.

Read More

ప్ర‌జ‌ల‌కి అంకితం..ఎన్టీఆర్ పార్క్

నందమూరి తారకరామారావు పార్కు అభివృద్ధి కావాలని స్థానిక ప్రజల చిరకాల కల ఈరోజు నెరవేరిందని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, అన్నమయ్య సర్కిల్ లో రూ. 2 కోట్ల వ్యయంతో నందమూరి తారకరామారావు పార్కు ను.. టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ నుడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, టీడీపీ నేత గిరిధ‌ర్‌రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్ మారంరెడ్డి జ్యోతి ప్రియ‌ల‌తో క‌లిసి ఎమ్మెల్యే అట్ట‌హాసంగా…

Read More

సంగంలో మేక‌పాటి జ‌యంతి

నెల్లూరు జిల్లా సంగంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంగం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పి హెచ్ సి లో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. గౌతంరెడ్డి చేసిన…

Read More

మ‌ర్రిపాడులో మేక‌పాటి జ‌యంతి వేడుక‌లు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మర్రిపాడు వైసీపీ కార్యాలయం, బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 53వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి మేకపాటి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి…

Read More

నాయుడుపేట‌లో రోడ్డెక్కిన కార్మికులు

తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ మున్సిపల్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వర్షా కాలంలో పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు, సామాగ్రీని ఇవ్వాలని చాపల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమానికి సిద్దమవుతాన‌ని చాపల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read More

స‌హ‌వాస దోషం..

రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. తనకి ప్రాణహాని ఉందని…పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడ బిడ్డ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం పవన్ కి గుర్తు లేదా..? అని సూటిగా ప్ర‌శ్నించారు. 77 మంది మహిళలు అఘాయిత్యలకు గురైతే.. వాటి గురించి పవన్ కనీసం మాట్లాడలేదని…. అలాంటి వ్యక్తి షర్మిలకి భద్రత కల్పిస్తామని చెప్పడం…

Read More

ఎన్టీఆర్‌ని ఎవ‌రు చంపేశారో అంద‌రికి తెలుసు…

రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే.. అందులో కుట్ర కోణం ఉందని ఇప్పుడు దుష్ప్రచారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని…మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. చంద్ర‌బాబునాయుడుపై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ ని ఎవరు చంపేసారో.. ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. అయన చనిపోవడానికి కారకులు చంద్రబాబు కాదా..?? అని సూటిగా ప్ర‌శ్నించారు.

Read More

ప‌ట్టువ‌స్త్రాలు కాదు…గోచి గుడ్డ ఇస్తాడు

ఐదు నెల‌ల చంద్ర‌బాబునాయుడు పాల‌న‌పై మాజీ మంత్రి కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. లా అండ్ ఆర్డర్డ్ లో ఫెయిల్ అయ్యావ్ అని మండిప‌డ్డారు. నిత్యావసరాలు ధరలు పెంచేయ్యడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కొలేక‌నే జగన్ కుటుంబం మీద బురద చళ్ళుతున్నారని విమ‌ర్శించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయ‌డంలో నారా లోకేష్ దిట్ట అని.. జగన్ కుటుంబం గురించి నీచంగా…

Read More

సూప‌ర్ సిక్స్…సూప‌ర్ ప్లాప్ ప్ర‌భుత్వం

సూప‌ర్ సిక్స్ కాద‌ని…సూప‌ర్ ప్లాప్ అని…సీఎం చంద్ర‌బాబునాయుడు తీసుకువ‌చ్చిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌పై మాజీ మంత్రి కాకాణి సెటైర్లు వేశారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో కాకాణి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. చంద్రబాబు డైవర్ష‌న్‌ పాలిట్రిక్స్ కి తెరలేపారని.. మాటలు తప్ప.. చేతలు శూన్యమ‌ని విమ‌ర్శించారు. కోటి 47 లక్షల రేషన్ కార్డ్స్ ఉంటే.. సగానికి సగం మందికి ఉచిత గ్యాస్ కట్ చేశారని మండిప‌డ్డారు. చంద్రబాబు మోసపురిత హామీలపై ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నారన్నారు.

Read More