ఇందుకూరుపేట‌లో క్ష‌ణాల్లో మారిన వాతావ‌ర‌ణం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలో ఒక్క సారిగా న‌ల్ల‌టి ద‌ట్ట‌మైన మేఘాల‌తో ఈదూరు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. దీంతో విద్యార్థులు, వాహ‌న‌దారులు కాస్త ఇబ్బందుల‌కు గుర‌య్యారు. క్ష‌ణాల్లోనే వాతావ‌ర‌ణం ఛేంజ్ అయ్యింది. అప్ప‌టి వ‌ర‌కు కురిసిన భారీ వ‌ర్షం ప‌డిన దాఖ‌లాలు లేకుండా….సాధార‌ణ వాతావ‌ర‌ణంగా మారిపోయింది

Read More

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…

అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు,ఎంపిటిసిలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు ప్రగతి నివేదికను…

Read More

ఎస్ఐ, సీఐలు స్పందించ‌కుంటే…డీఎస్పీని క‌ల‌వండి

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం 1989పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐడి డిఎస్పి కోటారెడ్డి పాల్గొని అవగాహనా నిర్వహించారు. ప్రతి ఒక్కరు చట్టల పై అవగాహనా కల్గి ఉంటే ఇబ్బందులు ఉండవని అన్నారు. కేసుల విషయంలో ఎస్ఐ, సీఐ స్పందించకుంటే నేరుగా డీఎస్పీని కలసి సమస్యలు పరిష్కారించుకోవ‌చ్చ‌ని తెలిపారు. కులమాతలకు అతీతంగా అందరు సమానమని ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు…

Read More

వ్య‌వ‌సాయ రంగాభివృద్ధికి సిడ్బి కృషి చేయాలి

విభజిత నెల్లూరు జిల్లా జిడిపి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే పెరిగే అవకాశం ఉన్నందున, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి సిడ్బి కృషి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. నెల్లూరు నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఎం ఎస్ ఎం ఇ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. క‌లెక్ట‌ర్…

Read More

సీహెచ్ సీ డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్ర‌హం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమెకు బుచ్చిరెడ్డి పాళెం నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి స్థానిక నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. మండల సర్వ సభ్య సమావేశంలో ముందుగా విద్యాశాఖకు సమందించిన పురోగతిని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన…

Read More

స‌ర్వేప‌ల్లిని రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతా…

నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్‌ కల్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సూర్య తేజ, జిల్లా, మండలస్థాయి అధికారులు హాజరై గిరిజనుల నుంచి…

Read More

కుప్పంలో వైసీపీ భారీ షాక్‌…

చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ త‌గిలింది. కుప్పం మున్సిప‌ల్ చైర్మ‌న్ డాక్ట‌ర్ సుధీర్ వైసీపీ రాజీనామా చేసి…తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్ర‌బాబు నాయుడును డాక్ట‌ర్ సుధీర్‌ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. సుధీర్‌కి సీఎం చంద్ర‌బాబు పార్టీ కండువా క‌ప్పి టీడీపీలో సాద‌రంగా ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబుతో…

Read More

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి…

53వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆధ్వర్యంలో న‌గ‌రంలోని వెంకటేశ్వరపురం సెంటర్లో స్థానిక ప్రజలందరూ కలిసి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… సామూహిక నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా అనంతరం 53వ డివిజన్ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ చైతన్యకు వినతి పత్రం సమర్పించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి… లేకుంటే ఉద్య‌మాలు చేప‌డుతాం అంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి…

Read More

సీఎంని కలిసిన వేమిరెడ్డి దంపతులు

ప్రశాంతి రెడ్డికి టిటిడి బోర్డు మెంబర్‌ గా అవకాశం కల్పించడంపై ధన్యవాదాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు….

Read More

తొల‌గించిన ప్రైవేట్ హాస్పిట‌ల్స్ హోర్డింగ్‌లు…N3 ఎఫెక్ట్

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయ‌ప‌ల్లి మండ‌లంలో ప్ర‌మాద‌క‌రంగా హోర్డింగ్‌లు…భ‌యాందోళ‌న‌లో విద్యార్థులు, ప్ర‌యాణికులు అన్న క‌థ‌నాన్ని ఎన్‌3 న్యూస్ ప్ర‌చురించింది. ఈ క‌థ‌నానికి సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ముందు, బాలిక‌ల గురుకుల పాఠ‌శాల ప్రాంగ‌ణం ఎదుట ప్రైవేట్ హాస్పిటల్స్ యాజ‌మాన్యం పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లు ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌ని విద్యార్థులు, ప్ర‌యాణికులు తెలియ‌జేశారు. దీనిపై ఎన్‌3 న్యూస్ ప్ర‌తినిధి క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. క‌థ‌నం ప్ర‌సార‌మ‌వ‌డంతో సంబంధిత అధికారులు…

Read More