సంక్రాంతి నాటికి రోడ్ల మీద గుంత‌లుండ‌వ్‌…

సంక్రాంతి నాటికి రూర‌ల్‌లో రోడ్ల మీద గుంత‌లు లేకుండా చేయ‌డ‌మే నా బాధ్య‌త అని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో ఆయ‌న జిల్లా కలెక్టర్ ఆనంద్ , టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుంత‌లు పూడ్చే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ముందుగా క‌లెక్ట‌ర్ కి ఎమ్మెల్యే పూల‌బొకే అంద‌చేసి ఘ‌న…

Read More

ప్ర‌శాంత‌మ్మ చొర‌వ‌… తుమ్మ‌గుంట అయ్య‌ప్ప‌స్వామి ఆల‌యానికి పూర్వ‌వైభ‌వం

కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌లంలోని తుమ్మ‌గుంట గ్రామంలో భ‌క్తుల కొంగుబంగార‌మై.. విరాజిల్లుతున్న శ్రీ గురునాథ‌స్వామి అయ్య‌ప్ప స్వామి ఆల‌యం పాల‌కుల నిర్ల‌క్ష్యం.. ప‌ర్య‌వేక్ష‌ణ‌లేని కార‌ణంగా ఆల‌యం ఆల‌నాపాల‌న‌తోపాటు.. ప‌రిశ‌రాలు అప‌రిశుభ్రంగా.. స‌రైన వ‌స‌తులు లేకుండా.. భ‌క్తుల‌కు అసౌక‌ర్యంగా.. ఇబ్బందిక‌రంగా ఉన్న వైనంపై సోమ‌వారం.. అయ్య‌ప్పా.. ఇదేంద‌య్యా.. ప్ర‌శాంత‌మ్మా.. మీరైనా ఇటు చూడండ‌మ్మా.. అనే ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ఎన్‌-3 ద్వారా వెలుగులోకి తేవ‌డం తెలిసిందే. ఎంతో విశిష్ట‌త‌.. ప్రాచీనం.. ప్రాధాన్య‌త క‌లిగి ఉండ‌టంతోపాటు అక్క‌డి అయ్య‌ప్ప‌స్వామి మ‌హిమ‌లుక‌లిగి.. కోరిన…

Read More

స‌హ‌వాస దోషం..

రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. తనకి ప్రాణహాని ఉందని…పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఆడ బిడ్డ మీడియా ముందుకు వచ్చి చెప్పిన విషయం పవన్ కి గుర్తు లేదా..? అని సూటిగా ప్ర‌శ్నించారు. 77 మంది మహిళలు అఘాయిత్యలకు గురైతే.. వాటి గురించి పవన్ కనీసం మాట్లాడలేదని…. అలాంటి వ్యక్తి షర్మిలకి భద్రత కల్పిస్తామని చెప్పడం…

Read More

ఎన్టీఆర్‌ని ఎవ‌రు చంపేశారో అంద‌రికి తెలుసు…

రెండేళ్ల క్రితం విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే.. అందులో కుట్ర కోణం ఉందని ఇప్పుడు దుష్ప్రచారం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని…మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. చంద్ర‌బాబునాయుడుపై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ ని ఎవరు చంపేసారో.. ఎవరు వెన్నుపోటు పొడిచారో అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. అయన చనిపోవడానికి కారకులు చంద్రబాబు కాదా..?? అని సూటిగా ప్ర‌శ్నించారు.

Read More

ప‌ట్టువ‌స్త్రాలు కాదు…గోచి గుడ్డ ఇస్తాడు

ఐదు నెల‌ల చంద్ర‌బాబునాయుడు పాల‌న‌పై మాజీ మంత్రి కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని ఆయ‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. లా అండ్ ఆర్డర్డ్ లో ఫెయిల్ అయ్యావ్ అని మండిప‌డ్డారు. నిత్యావసరాలు ధరలు పెంచేయ్యడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కొలేక‌నే జగన్ కుటుంబం మీద బురద చళ్ళుతున్నారని విమ‌ర్శించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయ‌డంలో నారా లోకేష్ దిట్ట అని.. జగన్ కుటుంబం గురించి నీచంగా…

Read More

సూప‌ర్ సిక్స్…సూప‌ర్ ప్లాప్ ప్ర‌భుత్వం

సూప‌ర్ సిక్స్ కాద‌ని…సూప‌ర్ ప్లాప్ అని…సీఎం చంద్ర‌బాబునాయుడు తీసుకువ‌చ్చిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌పై మాజీ మంత్రి కాకాణి సెటైర్లు వేశారు. నెల్లూరు డైక‌స్ రోడ్డులోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో కాకాణి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. చంద్రబాబు డైవర్ష‌న్‌ పాలిట్రిక్స్ కి తెరలేపారని.. మాటలు తప్ప.. చేతలు శూన్యమ‌ని విమ‌ర్శించారు. కోటి 47 లక్షల రేషన్ కార్డ్స్ ఉంటే.. సగానికి సగం మందికి ఉచిత గ్యాస్ కట్ చేశారని మండిప‌డ్డారు. చంద్రబాబు మోసపురిత హామీలపై ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నారన్నారు.

Read More

గుంతలు లేని రోడ్లే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెడ్డి తెలిపారు. కావలి పట్టణం 17వ వార్డులో బుడంగుంట ఆర్ అండ్ బి రోడ్డులో గుంతల మరమ్మతులకు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేకు టీడీపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పనులకు సంబంధించిన పూజాకార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Read More

ఏకవచనంతో సంభోదించడం సరికాదు…

ఒక మంత్రిగా పని చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి, మంత్రులను…ఏకవచనంతో సంభోదించడం తప్పు అని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు సొంత అవసరాలకు నారాయణ సార్ అని సంబంధించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నారాయణ అని ఏకవచనంతో సంభోదించడం సరికాదన్నారు. మంచి కార్యక్రమాలు…

Read More

తుమ్మలపెంటలో 2.0 దీపం ప్రారంభం

నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు టీడీపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దీపం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన మాటమేరకుఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకీ శ్రీకారం చుట్టారన్నారు. కావలి నియోజకవర్గంలో 38 వేల మంది పేదలకు…

Read More

ఒక్కొక్క హామీని నెర‌వేరుస్తున్న సీఎం చంద్ర‌బాబు

ఎన్నికలవేళ చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని… రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్, బట్వాడిపాలెం సెంటర్లో ఆయ‌న ఆర్డీవో నాగ సంతోష అనూష‌, టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికి ఎమ్మెల్యే ఉచిత గ్యాస్ సిలెండ‌ర్ల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More