మ‌హాద్భుతంగా మ‌హా కార్తీక దీపోత్స‌వం

కార్తీక మాసం పుర‌స్క‌రించుకొని ….సింహ‌పురి కార్తీక దీపోత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్తీక మ‌హా దీపోత్స‌వాన్ని నవంబ‌ర్ 15న మ‌హాద్భుతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇరుక‌ళ‌ల ప‌ర‌మేశ్వ‌రి ఆల‌య అర్చ‌కుల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ…ఉదయం శోభ యాత్రతో ప్రారంభించి… హరిద్వార్ నుండి వచ్చిన ఐదు మంది అర్చకుల చేత గంగా హారతి నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. అదే విధంగా 108 తెప్పలతో శివాకృతి నెల్లూరు చెరువులో…

Read More

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి…

53వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆధ్వర్యంలో న‌గ‌రంలోని వెంకటేశ్వరపురం సెంటర్లో స్థానిక ప్రజలందరూ కలిసి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… సామూహిక నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా అనంతరం 53వ డివిజన్ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ చైతన్యకు వినతి పత్రం సమర్పించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి… లేకుంటే ఉద్య‌మాలు చేప‌డుతాం అంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి…

Read More

సీఎంని కలిసిన వేమిరెడ్డి దంపతులు

ప్రశాంతి రెడ్డికి టిటిడి బోర్డు మెంబర్‌ గా అవకాశం కల్పించడంపై ధన్యవాదాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు….

Read More

తొల‌గించిన ప్రైవేట్ హాస్పిట‌ల్స్ హోర్డింగ్‌లు…N3 ఎఫెక్ట్

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయ‌ప‌ల్లి మండ‌లంలో ప్ర‌మాద‌క‌రంగా హోర్డింగ్‌లు…భ‌యాందోళ‌న‌లో విద్యార్థులు, ప్ర‌యాణికులు అన్న క‌థ‌నాన్ని ఎన్‌3 న్యూస్ ప్ర‌చురించింది. ఈ క‌థ‌నానికి సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ముందు, బాలిక‌ల గురుకుల పాఠ‌శాల ప్రాంగ‌ణం ఎదుట ప్రైవేట్ హాస్పిటల్స్ యాజ‌మాన్యం పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లు ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌ని విద్యార్థులు, ప్ర‌యాణికులు తెలియ‌జేశారు. దీనిపై ఎన్‌3 న్యూస్ ప్ర‌తినిధి క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. క‌థ‌నం ప్ర‌సార‌మ‌వ‌డంతో సంబంధిత అధికారులు…

Read More

రూర‌ల్ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కోటంరెడ్డి…

నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని పొట్టేపాలెం కలజు మీద బ్రిడ్జిని వెంటనే మంజూరు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించాలని…అధికారుల్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. నెల్లూరు రూరల్లో మూడు బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్నారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని… అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో మంజూరు అయ్యాయ‌ని…నేను పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో వాటిని ఆపేశార‌ని…

Read More

ఎంపీ అంటే లెక్క‌లేదా…అగౌరప‌రుస్తారా…

నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో…డీఆర్సీ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో వేదిక‌పై ఎంపీకి గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆయ‌న స‌భ నుంచి వెళ్లిపోయారు. వెంట‌నే ఎంపీ వేమిరెడ్డిని స‌ముదాయించేందుకు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు ప్ర‌య‌త్నించారు. నేను వెన‌క్కి రాలేన‌ని ఖ‌రాకండిగా చెప్పేసి జ‌డ్పీ నుంచి ఆయ‌న‌ వెళ్లిపోయారు. అక్క‌డే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి సైతం ఎంపీ వెంట వెళ్లిపోయారు.

Read More

ప్ర‌జ‌ల‌కి అంకితం..ఎన్టీఆర్ పార్క్

నందమూరి తారకరామారావు పార్కు అభివృద్ధి కావాలని స్థానిక ప్రజల చిరకాల కల ఈరోజు నెరవేరిందని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, అన్నమయ్య సర్కిల్ లో రూ. 2 కోట్ల వ్యయంతో నందమూరి తారకరామారావు పార్కు ను.. టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ నుడా చైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, టీడీపీ నేత గిరిధ‌ర్‌రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్ మారంరెడ్డి జ్యోతి ప్రియ‌ల‌తో క‌లిసి ఎమ్మెల్యే అట్ట‌హాసంగా…

Read More

సంగంలో మేక‌పాటి జ‌యంతి

నెల్లూరు జిల్లా సంగంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంగం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పి హెచ్ సి లో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. గౌతంరెడ్డి చేసిన…

Read More

మ‌ర్రిపాడులో మేక‌పాటి జ‌యంతి వేడుక‌లు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మర్రిపాడు వైసీపీ కార్యాలయం, బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 53వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి మేకపాటి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి…

Read More

నాయుడుపేట‌లో రోడ్డెక్కిన కార్మికులు

తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ మున్సిపల్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వర్షా కాలంలో పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు, సామాగ్రీని ఇవ్వాలని చాపల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమానికి సిద్దమవుతాన‌ని చాపల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read More