సంక్షేమ ప‌థ‌కాల‌కు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాలి

రాష్ట్రంలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేసేందుకు తగినన్ని నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. జిల్లా కమిటీ పిలుపులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం కమిటీ ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అంద‌చేశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ మాట్లాడుతూ… హామీలు ఇంత వరకు అమలు కాలేదని ఈ బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించి సంక్షేమ…

Read More

క‌ట్ట‌మంచిలో భ‌గ్గుమ‌న్న రాజ‌కీయ క‌క్ష్య‌లు

పూతలపట్టు మండల వైసీపీ కన్వీనర్ వావిల్ తోట శ్రీకాంత్ పై…గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌…చిత్తూరు కట్టమంచిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో శ్రీ‌కాంత్‌తోపాటు…మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. క్ష‌గాత్రుల్ని వైసీపీ నాయ‌కులు, కుటుంబ స‌భ్యులు చిత్తూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో…క‌ట్ట‌మంచిలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు నిర్వ‌హించారు. ఈ విష‌యం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జి విజ‌యానంద‌రెడ్డి దాడిలో గాయ‌ప‌డ్డ వారిని ప‌రామ‌ర్శించారు. దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు….

Read More

ఇందుకూరుపేట‌లో క్ష‌ణాల్లో మారిన వాతావ‌ర‌ణం

నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేట మండ‌లంలో ఒక్క సారిగా న‌ల్ల‌టి ద‌ట్ట‌మైన మేఘాల‌తో ఈదూరు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసింది. దీంతో విద్యార్థులు, వాహ‌న‌దారులు కాస్త ఇబ్బందుల‌కు గుర‌య్యారు. క్ష‌ణాల్లోనే వాతావ‌ర‌ణం ఛేంజ్ అయ్యింది. అప్ప‌టి వ‌ర‌కు కురిసిన భారీ వ‌ర్షం ప‌డిన దాఖ‌లాలు లేకుండా….సాధార‌ణ వాతావ‌ర‌ణంగా మారిపోయింది

Read More

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…

అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు,ఎంపిటిసిలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు ప్రగతి నివేదికను…

Read More

ఎస్ఐ, సీఐలు స్పందించ‌కుంటే…డీఎస్పీని క‌ల‌వండి

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం 1989పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐడి డిఎస్పి కోటారెడ్డి పాల్గొని అవగాహనా నిర్వహించారు. ప్రతి ఒక్కరు చట్టల పై అవగాహనా కల్గి ఉంటే ఇబ్బందులు ఉండవని అన్నారు. కేసుల విషయంలో ఎస్ఐ, సీఐ స్పందించకుంటే నేరుగా డీఎస్పీని కలసి సమస్యలు పరిష్కారించుకోవ‌చ్చ‌ని తెలిపారు. కులమాతలకు అతీతంగా అందరు సమానమని ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు…

Read More

వ్య‌వ‌సాయ రంగాభివృద్ధికి సిడ్బి కృషి చేయాలి

విభజిత నెల్లూరు జిల్లా జిడిపి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే పెరిగే అవకాశం ఉన్నందున, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి సిడ్బి కృషి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. నెల్లూరు నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఎం ఎస్ ఎం ఇ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. క‌లెక్ట‌ర్…

Read More

సీహెచ్ సీ డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్ర‌హం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమెకు బుచ్చిరెడ్డి పాళెం నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి స్థానిక నాయకులు, అధికారులు అభినందనలు తెలియజేశారు. మండల సర్వ సభ్య సమావేశంలో ముందుగా విద్యాశాఖకు సమందించిన పురోగతిని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన…

Read More

స‌ర్వేప‌ల్లిని రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్దుతా…

నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్‌ కల్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ ఆనంద్‌, నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సూర్య తేజ, జిల్లా, మండలస్థాయి అధికారులు హాజరై గిరిజనుల నుంచి…

Read More

ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉదయగిరి జిల్లా ఉద్యమ గర్జన…!

హైస్కూల్ నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు భారీ ర్యాలీ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి జిల్లా సాధనే లక్ష్యంగా ఉదయగిరిలో ఉధృతం చేశారు. జిల్లా సాధన సమితి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, షేక్ దస్తగిరి అహ్మద్ సారథ్యంలో ఉదయగిరిలో హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు భారీ జన సందోహం మధ్య జానపద కళాకారుల డప్పులతో ర్యాలీగా నిర్వ‌హించారు. అనంతరం బ‌స్టాండ్ వ‌ద్ద‌ మానవహారం చేప‌ట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ… ఏళ్ల తరబడి వివక్షకు…

Read More

కుప్పంలో వైసీపీ భారీ షాక్‌…

చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ త‌గిలింది. కుప్పం మున్సిప‌ల్ చైర్మ‌న్ డాక్ట‌ర్ సుధీర్ వైసీపీ రాజీనామా చేసి…తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్ర‌బాబు నాయుడును డాక్ట‌ర్ సుధీర్‌ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. సుధీర్‌కి సీఎం చంద్ర‌బాబు పార్టీ కండువా క‌ప్పి టీడీపీలో సాద‌రంగా ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబుతో…

Read More