
ఎంత దౌర్భాగ్యం… గేటుకు రంధ్రం..
రాళ్పపాడు జలాశయంలో ఒకపక్క పుష్కలంగా సాగునీరు ఉంది. మరోపక్క వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి, సాగు సిద్దం చేసుకున్న పొలాలకు అదునుదాటిపోతుందన్న ఆందోళనతో రైతులు మదన పడిపోతున్నారు. కానీ గత 15 రోజులుగా సాగునీరు విడుదల చేసేందుకు తూము గేటు తెరుచుకోవడం లేదు. గేటును ఈ రోజు తెరుస్తాం, ఇదిగో అదిగో అంటూ అధికార యంత్రాంగం నానా హడావిడి చేసినా ప్రయోజనం శూన్యం. చివరకు అధికారులు చేతులెత్తేయడంతో ఆదివారం రైతులు తీవ్ర…