ఎంత దౌర్భాగ్యం… గేటుకు రంధ్రం..

రాళ్పపాడు జలాశయంలో ఒకపక్క పుష్కలంగా సాగునీరు ఉంది. మరోపక్క వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి, సాగు సిద్దం చేసుకున్న పొలాలకు అదునుదాటిపోతుందన్న ఆందోళనతో రైతులు మదన పడిపోతున్నారు. కానీ గత 15 రోజులుగా సాగునీరు విడుదల చేసేందుకు తూము గేటు తెరుచుకోవడం లేదు. గేటును ఈ రోజు తెరుస్తాం, ఇదిగో అదిగో అంటూ అధికార యంత్రాంగం నానా హడావిడి చేసినా ప్రయోజనం శూన్యం. చివరకు అధికారులు చేతులెత్తేయడంతో ఆదివారం రైతులు తీవ్ర…

Read More

జ‌గ‌న్ పాల‌న‌పై క‌విత‌లు చ‌దివిన సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాల‌యంలో…స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌… జగన్ పాలనలో దోపిడీ, కబ్జాలపై కవితలు చదివి వినిపించారు. 104, 108 అంబులెన్సు సర్వీసెస్ ను జీవికే నుండి తీసుకున్న అరబిందో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. జీవికే సంస్థకు ఇస్తున్న డబ్బు కంటే డబుల్ చేసి దోపిడీకి పాల్పడ్డట్టు నిర్దారణ అయ్యిందన్నారు. రోహిత్ రెడ్డి మైంటైన్ చేసి దోపిడీ చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలన్నారు. ప్రజల…

Read More

ప్ర‌శాంత‌త లేదు..న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు..!

త‌మ ప్రాంతంలో ఏర్పాటుచేసిన మ‌ద్యం దుకాణాన్ని తీసేయాలంటూ.. స్థానికులు ఉద్య‌మం చేప‌ట్టి నేటితో ప‌ది రోజులుదాటిపోయింది. అయినా.. మ‌ద్యం వ్యాపారుల్లో చ‌ల‌నం లేదు.. అధికారుల్లో క‌ద‌లిక లేదు.. పాల‌కుల్లో కాస్తైనా ద‌య లేదు.. దాంతో మ‌ద్యం వ్యాపారులు మాత్రం త‌మ వ్యాపారాన్ని వారు చేసుకుంటూ పోతున్నారు. పిల్ల‌ల‌కు, మ‌హిళ‌ల‌కు మ‌ద్యం బాబుల వ‌ల్ల ఇబ్బందులు మాత్రం త‌ప్ప‌టం లేదు. ఇంత‌కు ప‌ది రోజులుగా ఈ ఉద్యమం చేస్తుంది ఎక్క‌డో కాదు.. నెల్లూరు న‌గ‌రం ప‌ర‌మేశ్వ‌రి న‌గ‌ర్‌లో.. త‌మ…

Read More

నీకు రైతులు తాట తీస్తారు…

ఏంది నువ్వొచ్చి పీకేది…రైతుల జోలికి వ‌స్తావా నువ్వు…ద‌మ్ముందా నీకు…అంటూ మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి…స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఇక్క‌డ‌కి వ‌చ్చేందుకు నీకు ద‌మ్ములేక‌…హౌస్ అరెస్ట్ అని…పెద్ద సీన్ క్రియేట్ చేశావ‌ని కాకాణి హౌస్ అరెస్ట్ పై సెటైర్లు వేశారు. నీకు రైతులంద‌రూ తాట తీస్తార‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం పొద‌ల‌కూరులో సోమిరెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

Read More

రైతుల‌కి మంచి రోజులు

పొద‌ల‌కూరు మండ‌లంలోని క‌నుపూరు కాలువ రెగ్యులేట‌ర్ వ‌ద్ద‌…క‌నుపూరు కాలువ‌కి సాగునీటి విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు ఘ‌న స్వాగ‌తం పలికారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాలువ రెగ్యులేట‌ర్ వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి…గంగ‌మ్మ‌కి సారె స‌మ‌ర్పించి రైతుల‌తో క‌లిసి క‌నుపూరు కాలువ‌కు సాగునీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వంలో రైతుల‌కి మంచి…

Read More

ఎక్సైజ్ సీఐ లైసెన్స్ ఇవ్వ‌డం లేదు

పొదలకూరు ఎక్సైజ్ సీఐ తమ మద్యం షాపుకు సంబంధించిన పర్మినెంట్ లైసెన్స్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని… మద్యం షాపు లైసెన్స్ హోల్డర్ కడియాల లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు‌. పొద‌ల‌కూరులోని స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆమె కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు.

Read More

న‌వంబ‌ర్ 16న సోమేశ్వ‌రాల‌య పునఃనిర్మాణ శంఖుస్థాప‌న‌

నెల్లూరు జిల్లాలోని సోమశిల గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలొని పలు ప్రాంతాలు గతంలో వచ్చిన వరదలకు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 16వ తేదీ సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర దేవాలయం పునర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్…

Read More

మైన‌ర్ బాలిక కేసులో ఎవ‌ర్ని వ‌ద‌లొద్దు…

ఓ మైన‌ర్ బాలిక‌పై ప‌లు అత్యాచారానికి పాల్ప‌డిన కేసులో…ఎవ‌రిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని…నిందితులంద‌రికి క‌ఠిన శిక్ష‌లు ప‌డాల‌ని టిడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్‌కుమార్ పోలీసుల్ని కోరారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలోని టిడ్కో గృహంలో నివాసం ఉంటున్న‌…బాధిత మైన‌ర్ బాలిక కుటుంబాన్ని ఆయ‌న జ‌న‌సైనికుల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఘ‌ట‌న‌పై కుటుంబ స‌భ్యుల్ని వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని వారికి అజ‌య్‌కుమార్ ధైర్యాన్ని క‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో…టిడ్కో గృహాల్లో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల్ని ల‌బ్దిదారులు…

Read More

విద్యుత్ చార్జీలు త‌గ్గించ‌క‌పోతే ఉద్య‌మ‌మే

కూటమి ప్రభుత్వం సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన కరెంట్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సంద‌ర్భంగా నెల్లూరు సిటీ నియోజక వర్గ ఇన్చార్జి నారపరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో న‌గ‌రంలోని రామమూర్తినగర్ వ‌ద్ద ఉన్న‌ మిలీనియం సబ్ స్టేషన్ వద్ద నిరసన చేప‌ట్టారు. కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు లాంత‌ర్లు చేత‌ప‌ట్టి…పెంచిన క‌రెంటు చార్జీల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంత‌రం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన…

Read More