ప్ర‌యాణికుడిని కొట్టిన డ్రైవ‌ర్‌

ఓ ప్ర‌యాణికుడిపై బ‌స్సు డ్రైవ‌ర్ దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కావ‌లిలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది. లాజర్ అనే ప్రయాణికుడు మద్యం తాగి బస్సు ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవ‌ర్ అత‌న్ని అడ్డుకున్నాడు. తాగి బస్సు ఎక్కకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ తనను కొట్టడంతో పన్ను విరిగి నోటి నిండా రక్తస్రావమైందని లాజర్ ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు బస్సు…

Read More

న‌వదంపతుల కిడ్నాప్ కలకలం…

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నవదంపతుల కిడ్నాప్ కలకలం రేపింది. వెంకటగిరి మండలం సీసీ కండ్రిగకు చెందిన వెల్లూరు రాజా(23), ఆయన భార్య పెంచలమ్మ(20) రెండు రోజుల క్రితం దీపావళి పండగకు చిట్వేల్ మండలంలోని అత్తగారి ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో వారిని ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. రాపూరు అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి రాజాను పోలీసులు గుర్తించారు. పెంచలమ్మ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు…

Read More

మా త‌ల్లి మ‌ర‌ణానికి కార‌ణం వారే…!

వైద్యులు, సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓ మ‌హిళ మృతి చెందిన దారుణ ఘ‌ట‌న‌… నెల్లూరు పెద్దాసుప‌త్రిలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ స‌భ్యుల వివ‌రాల మేర‌కు… నెల్లూరు బుజ బుజ నెల్లూరు భ‌గ‌త్ సింగ్ కాల‌నీకి చెందిన రాచూరి ల‌క్ష్మి అనారోగ్యానికి గురైంది. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆమెని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు త‌ర‌లించారు. రాచూరి ల‌క్ష్మిని ఆసుప‌త్రిలోని ఐపీ బిల్డింగ్‌లో అడ్మిట్ చేశారు. మా అమ్మ‌కి బాగా ఇబ్బందిగా ఉంది…తొంద‌ర‌గా ట్రీట్ మెంట్ చేయండని…వార్డులో ఉన్న…

Read More

తండ్రిని చంపిన కొడుకు

వాకాడులో దారుణం తిరుపతి జిల్లా వాకాడు మండలం శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది… మద్యం మత్తులో కన్నతండ్రి చిన్నరామయ్యపై కుమారుడు రమేష్ విచక్షణారహితంగా కర్రతో దాడి చేయడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు… చిన్నపాటి వివాదం కారణంగా క్షణికావేశంలో తండ్రిపై దాడికి పాల్పడి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు… గిరిజన కాలనీలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More