భ‌గ‌త్ సింగ్ కాల‌నీలో కార్డెన్ సెర్చ్

నెల్లూరు న‌గ‌రం భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో గృహాలలో న‌వాబుపేట సీఐ అన్వ‌ర్‌బాషా ఆధ్వ‌ర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించారు. సీఐ త‌న సిబ్బందితో క‌లిసి ఇంటింటికెళ్లి క్షుణ్ణంగా త‌నిఖీలు చేశారు. స్థానిక ప్ర‌జ‌ల‌కి ఆయ‌న ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఎవ‌రైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అన్వర్ భాషా హెచ్చరించారు.. పత్రాలు లేని వాహనాలను స్టేషన్కు తరలించారు.

Read More

బెల్టు పెడితే క్రిమిన‌ల్ కేసే

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో అక్రమంగా ఓ వ్యక్తి మద్యం అవుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి రాత్రి దాడులు నిర్వహించారు .ఈ దాడుల్లో పాశం కృష్ణయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు లైసెన్స్ కలిగిన షాపు దారులు మాత్రమే మద్యం విక్రయించాలని ఎస్సై సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా…

Read More

ఒకే ప్ర‌మాదం… మూడు వాహ‌నాలు ధ్వంసం

తిరుప‌తి జిల్లా పెళ్ల‌కూరు మండ‌లం త‌ల్వాయిపాడు గ్రామ స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి. నాయుడుపేట వైపు వ‌స్తున్న టిప్ప‌ర్‌ను… శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి నాయుడుపేట వ‌స్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంస‌మై అందులోని వారికి గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ స్తంభించ‌గా వెనుక నుంచి వ‌స్తున్న మ‌రో కారు ఆగి ఉన్న వాహ‌నాల‌ను ఢీకొట్టింది. అదేవిధంగా ఆగి ఉన్న…

Read More

రెండు కార్లు ఢీ

రెండు కార్లు ఢీకొని…న‌లుగురికి గాయాలైన సంఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం చంద్ర‌శేఖ‌ర పురం జాతీయ ర‌హ‌దారిపై చోటు చేసుకుంది. స్థానికుల వివ‌రాల మేర‌కు…ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి రెండు కార్లు ఢీకొన్న‌ట్లు స్థానికులు వెల్లడించారు. అతివేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ట్లు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌ను 108 వాహ‌నం ద్వారా ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Read More

త‌న్నుకున్న తెలుగు త‌మ్ముళ్లు

ఓ స్థ‌ల వివాదంలో…మాజీ కార్పొరేట‌ర్‌, ప్ర‌స్తుత కార్పొరేట‌ర్ వ‌ర్గాలు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలో చోటు చేసుకుంది. ఈ దాడుల్లో… 53,54 క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జి జ‌హీర్ త‌ల‌కు తీవ్ర గాయాల‌వ‌డంతోపాటు…ఇరువ‌ర్గాల వారికి ర‌క్త‌పు గాయాల‌య్యాయి. దీంతో జ‌హీర్ ని ఆయ‌న అనుచ‌రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్‌కి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి అపోలోకు త‌ర‌లించారు. అలాగే ఈ దాడుల్లో ముజీర్ వ‌ర్గం అనుచ‌రులు కూడా గాయ‌ప‌డ్డారు. వారు…

Read More

చిట్టమూరులో విషాదం…

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది… స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలో మునిగి వీరేంద్ర సాయి (14) అనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు… పాఠశాల వదిలిన తర్వాత తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు.. ఇసుక తవ్వకాలు జరిపిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండడంతో వీరేంద్ర సాయి ఇసుకలో కూరుకుపోయి మునిగిపోయాడు.. మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంగా…

Read More

సూట్‌కేస్‌లో శ‌వం..!

ఖ‌ర్మ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌దంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజం .. కొద్ది గంట‌ల్లోనే ఓ తండ్రి, కూతురు విష‌యంలో నిరూపించింది.. న‌గ‌ల కోసం ఓ వృద్ధురాలిని అతి కిరాత‌కంగా చంపేశారు.. ఆమె శ‌వాన్ని సూట్ కేసులో పెట్టుకుని.. మాయం చేసేప‌నిలో ఊరుగాని ఊరు.. రాష్ట్రంగాని రాష్ట్రం వెళ్లి..పోలీసుల‌కు దొరికిపోయారు. అన్యంపుణ్యం ఎరుగని ఆ వృద్ధురాలిని కిరాత‌కంగా చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. చెన్నైలో ప‌డేద్దామ‌నుకుని ఇలా.. పోలీసుల‌కు దొరికిపోవ‌డంతో ఖ‌ర్మ‌సిద్ధాంతం నిజ‌మ‌ని నిరూపించింది. ఈ హ‌త్య జ‌రిగిన…

Read More

క‌లెక్ట‌ర్ సార్‌…మీరైనా న్యాయం చేయండి

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినిని ఓ మోస‌గాడు మోసం చేసి అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాప్ర‌య‌త్నానికి కారకుడైన మోసగాడు హాసన్ ను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయ‌కుల‌తో క‌లిసి బాధిత కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ఆనంద్‌ని క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. అర్జీ తీసుకున్న కలెక్టర్ విచారణ జరిపి బాధితురాలికి…

Read More

వాకాడులో విషాదం…

పాముకాటుతో 14 ఏళ్ల పంటరంగం చరణ్ బాలుడు మృతి చెందిన ఘటన… తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో కుటుంబ స‌భ్యులు అత‌న్ని హుటాహుటిన‌ హాస్పిటల్ కు తరలించారు..హాస్పిటల్ లో చికిత్స పొందు మృతి చెందాడు. హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక సరైన మందులు లేక‌నే ..మా బిడ్డ చనిపోయాడని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. చ‌ర‌ణ్ బాలిరెడ్డిపాళెం జ‌డ్పీ హూస్కూల్‌లో ప‌దో…

Read More

ట్రీట్మెంట్ చేయ‌క‌పోవ‌డంతోనే మృతి..

నెల్లూరు జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగానే….బుజ బుజ నెల్లూరు భ‌గ‌త్ సింగ్ కాల‌నీకి చెందిన రాచూరి ల‌క్ష్మి మృతి చెందిన‌ట్లు ఆమె కుమారుడు రాచూరి శేషవ రావు ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…త‌న త‌ల్లి మృతికి కార‌ణ‌మైన పెద్దాసుప‌త్రిలోని వైద్యులు, సిబ్బందిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ద‌ర్గామిట్ట పోలీసుస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారిని విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ పోలీసుల‌కు విన‌తి ప‌త్రం అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా…

Read More