వెంక‌య్య‌స్వామి ఆరాథ‌నోత్స‌వాల్లో సోమిరెడ్డి

స్వామి వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌లం గొల‌గ‌ముడిలో వెల‌సి ఉన్న‌…వెంక‌య్య‌స్వామి ఆశ్ర‌మంలో 42వ ఆరాధ‌న మ‌మ‌హోత్స‌వం జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి ఆల‌య నిర్వాహ‌కులు, అర్చ‌కులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌స్వామి వారికి సోమిరెడ్డి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం స్వామి వారిని ద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని…

Read More

ఎష‌న్షియ యాజ‌మాన్యాన్ని వెంట‌నే అరెస్ట్ చేయాలి

అచ్యుతాపురం ఎష‌న్షియ ఫారా కంపెనీలో జ‌రిగిన ప్ర‌మాదంపై యాజ‌మాన్యాన్ని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ… నెల్లూరులోని లేబ‌ర్ ఫ్యాక్ట‌రీస్ ఇన్‌స్పెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట‌ ధ‌ర్నా సీఐటీయూ ధ‌ర్నా చేప‌ట్టింది. యాజ‌మాన్యాన్ని అరెస్ట్ చేయాల‌ని…త‌క్షణ‌మే మృతుల‌కు కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాల‌ని నినాదాలు చేశారు. అదే విధంగా నెల్లూరు జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికుల‌కు భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అధికారుల్ని కోరారు. అనంత‌రం…ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్ కార్య‌ద‌ర్శి గోగుల శ్రీ‌నివాసులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ అధ్య‌క్షులు టీవీవీ ప్ర‌సాద్ లు…

Read More

కేసులు.. అరెస్టులు.. జైళ్ల‌కు భయపడం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చంద్ర‌బాబు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేము భయపడమ‌ని…మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమ‌న్నారు. ఏమి నేరం చేశారని దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారని ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని తెలిపారు. అధికారులు…

Read More

ఎట్ట‌కేల‌కు పిన్నెల్లి విడుద‌ల‌…

జైలు వ‌ద్ద రామ‌కృష్ణారెడ్డికి స్వాగ‌తం ప‌లికిన మాజీ మంత్రులు 2024 ఎన్నిక‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో…ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలుకు పంపించిన విష‌యం విధిత‌మే. ఈవీఎం ధ్వంసం కేసులో…సుమారు 59 రోజులు ఆయ‌న రిమాండ్ అనుభ‌వించారు. ఈ క్ర‌మంలో పిన్నెల్లికి ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆగ‌స్ట్ 23వ‌తేదీ సాయంత్ర‌మే రామ‌కృష్ణారెడ్డికి బెయిల్ వ‌చ్చింది. బెయిల్ వ‌చ్చినా…మ‌ళ్లీ పీడీ…

Read More

జాతీయ రహదారిపై నిలిచిపోయిన‌ వాహనాలు

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెం సమీపంలో తెల్లవారు జామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్లు మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఉద్యోగులు, స్కూల్స్, కాలేజీ లకు వెళ్ళేసమయం కావడంతో మరింత ట్రాఫిక్ ఏర్పడింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

Read More

క‌న్నీళ్లు పెట్టిన వైద్యులు…

కోల్‍కత్తాలో ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ…నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ…త‌మ క‌న్నీటితో తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read More

OP సేవ‌లు బంద్‌…

కోల్‍కత్తాలో ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా…నెల్లూరులోని హాస్పిట‌ళ్లు అన్నీ మూత ప‌డ్డాయి. దీంతో…24 గంట‌ల పాటు హాస్పిట‌ల్‌లో వోపీ వైద్య సేవ‌ల‌ను నిలిపి వేశారు. నిత్యం ర‌ద్దీగా ఉన్న న‌గ‌రంలోని పొగ‌తోట కూడ‌లి ఒక్క సారిగా నిర్మానుషంగా మారిపోయింది. ఈ క్ర‌మంలో…ఈ విష‌యం కొంత మందికి తెలియ‌క‌పోవ‌డంతో… త‌ల్లిదండ్రులు త‌మ చంటి బిడ్డ‌ల‌ను ఎత్తుకొని…పొగ‌తోట‌లోని హాస్పిట‌ళ్ల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాయి. ఒక్క సారిగా వైద్య సేవ‌లు నిలిచిపోవ‌డంతో… ప్ర‌జ‌లు అల్లాడిపోయారు.

Read More

నెల్లూరులో సంద‌డి చేసిన రాధిక (నేహాశెట్టి)

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని కింగ్స్ కోర్ట్ అవెన్యూలో…ర‌వి కుమార్ గుర్రం, సూర్య గుర్రం, డాక్ట‌ర్ సుజితలు శ్రీ సూర్య జ్యూయ‌ల‌ర్స్ గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్స్ షోరూమ్ అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి విచ్చేశారు. ముందుగా హీరోయిన్ కి షోరూమ్ అధినేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా నేహాశెట్టి చేతుల మీదుగా షోరూమ్‌ని ప్రారంభించారు. నేహాశెట్టిని చూసేందుకు అభిమానులు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో విచ్చేశారు. రాధిక…

Read More

శ్రీ సూర్య జ్యూయ‌ల‌ర్స్ మ‌రింత అభివృద్ధి చెందాలి

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని కింగ్స్ కోర్ట్ అవెన్యూలో…ర‌వి కుమార్ గుర్రం, సూర్య గుర్రం, డాక్ట‌ర్ సుజితలు శ్రీ సూర్య జ్యూయ‌ల‌ర్స్ గోల్డ్, సిల్వ‌ర్‌, డైమండ్స్ షోరూమ్ అట్ట‌హాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, టీడీపీ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్‌లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ముందుగా అతిధుల‌కి షోరూమ్ అధినేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు జ్యూయ‌ల‌ర్స్ ని…

Read More

పేద‌ల క‌డుపు నింపాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం…

ఆకలితో వున్న పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న స్వర్గీయ ఎన్టిఆర్ ఆశయాన్ని… సిఎం చంద్రబాబు నాయడు అన్న క్యాంటీన్ల ద్వారా అమలు చేస్తున్నారన్నారని… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు న‌గ‌రం 8వ డివిజ‌న్ త‌డిక‌ల బ‌జారులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి విచ్చేసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ముందుగా స్థానిక కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అంద‌రితో క‌లిసి ప్ర‌శాంతిరెడ్డి అల్పాహారం…

Read More