కుప్పంలో క‌ల‌క‌లం..!

కుప్పం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతోంది. పట్టణంలోని ప్యాలెస్ రోడ్లో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా.. రోడ్డు డివైడర్ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారంటూ.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మధ్యలో ముగ్గేసి అందులో ఎర్రటి గుడ్డ, పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ముగ్గు చుట్టూ రక్తపు మరకలు ఉండడంతో జంతుబలి ఇచ్చి ఉంటారని స్థానికులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ క్షుద్ర పూజలు చేసి…

Read More

మినిస్ట‌ర్‌ చెప్పినా…డోంట్ కేర్‌అధికారుల తీరుపై త‌మ్ముళ్లు తిరుగుబాటు

ఆత్మ‌కూరు మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద మంత్రి ఆనం ముఖ్య అనుచ‌రుడు ఆందోళ‌న‌ ఆత్మ‌కూరు మున్సిపాలిటీ ప‌రిధిలోని వెంక‌ట్రావుప‌ల్లి రెండో వార్డులో ఓ స్థ‌లంలో ఉంద‌ని…ఎటువంటి అనుమ‌తులు లేకుండా…అక్ర‌మ ఇంటి నిర్మాణం మొద‌లు పెట్టార‌ని…దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ముఖ్య అనుచ‌రుడు చ‌ల్లా ర‌వికుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ క్ర‌మంలో మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద త‌న అనుచ‌రుల‌తో క‌లిసి…బైఠాయించి ఆందోళ‌న‌కు దిగారు.ఈ సంద‌ర్భంగా ర‌వికుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్ర‌మంగా ఇంటి నిర్మాణం చేప‌డుతున్నార‌ని అధికారుల‌కి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డం…

Read More

హద్దులు దాటితే తాటతీస్తా

సూళ్లూరుపేట ఎస్ఐ బ్ర‌హ్మ‌నాయుడు వార్నింగ్‌ ప‌ట్ట‌ణంలో దుకాణ‌దారులు, వాహ‌న‌దారులు హ‌ద్దులు దాటితే తాట తీస్తాన‌ని… సూళ్లూరుపేట ఎస్ఐ బ్ర‌హ్మ‌నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో…ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు ఎస్ఐ ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. పుర‌వీధుల్లో తిరుగుతూ దుకాణ‌దారుల‌కు హ‌ద్దులు నిర్దేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ ప్రజల సహకరించాలని ఎస్ఐ కోరారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో దుకాణ యజమానులకు పరిశుభ్రత, ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. దీంతో సుదీర్ఘ కాలంగా పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికినట్లు అయిందని…

Read More

నా కుటుంబం ఎలాంటిదో ప్ర‌జ‌ల‌కు తెలుసు…

నా కుటుంబం ఎలాంటిదో గ్రామ ప్ర‌జ‌లంద‌రికి తెలుసున‌ని…త‌న భ‌ర్త‌పై అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లు చేస్తే ఊరుకోన‌ని…దండిగుంట గ్రామ స‌ర్పంచ్ బెల్లంకొండ సుప్ర‌జ హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు జిల్లా విడ‌వ‌లూరు మండ‌లం దండిగుంట గ్రామంలో గ్రామ స‌ర్పంచ్‌, త‌న భ‌ర్త శ్రీ‌ధ‌ర్‌లు మీడియాతో మాట్లాడారు. త‌న భ‌ర్త‌పై మండ‌ల టీడీపీ నాయ‌కులు అస‌త్య ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. త‌మ కుటుంబం ఎలాంటిదో గ్రామ ప్ర‌జ‌లంద‌రికి తెలుసున‌ని చెప్పారు. నా భర్తను టిడిపి నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే…

Read More

అన్న క్యాంటీన్లో అన్న‌దానం

సౌత్ ఇండియా బలిజ సంఘం నాయకులు శ్రీ‌నివాసులునాయుడు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సౌత్ ఇండియా బ‌లిజ సంఘం నాయ‌కులు నున్నా శ్రీ‌నివాసులునాయుడు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా… నెల్లూరు న‌గ‌రంలోని రామ‌లింగాపురం అన్న క్యాంటీన్లో అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మంత్రి నారాయ‌ణ పిలుపుతో …రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫ్లెక్సీలు, ట‌పాసులు, కేక్ క‌టింగ్‌లు వృధా ఖ‌ర్చులు చేయ‌కుండా…జోరేప‌ల్లి గురుకృష్ణ ఆధ్వ‌ర్యంలో పేద‌ల‌కు అన్న‌దానం చేయ‌డం జ‌రిగింద‌ని…టీడీపీ నాయ‌కులు పాశం మ‌ల్లికార్జున‌, డీ సురేష్‌, క్రాంతిలు తెలిపారు. ఈ…

Read More

బ‌రితెగిస్తున్న గంజాయి స్మ‌గ్ల‌ర్లు

గంజాయికి అడ్డాగా నెల్లూరు మారుతోందా..? విశాఖ‌.. ఒడిస్సా..ల నుంచి నెల్లూరు మీదుగా చెన్నైకు భారీగా త‌ర‌లి పోతోందా..? రోడ్డు, రైల్వే మార్గాల‌నే ఎంచుకున్నారా..? వ‌యా నెల్లూరులో దిగుమ‌తి అవుతోందా..? నెల్లూరు కేంద్రంలోనూ గంజాయి స్లీప‌ర్ సెల్స్ ఉన్నారా..? ఓయో రూములు, లాడ్జీలు, గెస్ట్ ఇన్ ల‌నే వారు కేంద్రాలుగా చేసుకుని లావాదేవీలు చేస్తున్నారా..? ఇంత జ‌రుగుతున్నా పోలీసులు ఎందుకు గంజాయి ముఠాల‌పై దృష్టి పెట్ట‌డంలేదు..? గ‌తంలో ప‌ట్టుబ‌డ్డ నిందితుల నుంచి కూపీ లాగినా.. స‌మూలంగా ఎందుకు నిర్మూలించ‌లేక‌పోతున్నారు..?…

Read More

వైద్యురాలి ఘటన అమానుషం

కోల్‌క‌త్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనను నిరసించిన జోహార్ భారతి కళాశాల విద్యార్థులు కోల్‌క‌త్తాలోని వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై కావ‌లి ప‌ట్ట‌ణంలోని జవహర్ భారతి జూనియర్ కాలేజ్ , బి.ఎస్.సి నర్సింగ్, పారామెడికల్ విద్యార్థిని ,విద్యార్థులు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. జవహార్ భారతి కాలేజ్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. బ్రిడ్జి సెంటర్ లో మానవహారంగా ఏర్పడి నిరసనలు తెలిపారు. అనంతరం జవహర్ భారతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్…

Read More

మ‌లేషియాలో ప్ర‌మాదం….

కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లి కి చెందిన జి.పళని కుమార్తె విజయలక్ష్మి(40) మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికీ ఆమె ఆచూకి దొరకలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఎమ్మెల్సీ…

Read More

విశ్వ‌సాయి ఎస్ఆర్‌కేలోఘ‌నంగా శ్రీకృష్ణ‌జ‌న్మాష్ట‌మి

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్‌లోని విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కే స్కూల్లో… ముంద‌స్తు శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా చిన్నారులు వేసిన‌ కృష్ణుడు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌లు…కృష్ణుడి పాట‌ల‌కు వారు చేసిన నృత్యాలు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోనే ఉట్టి మ‌హోత్స‌వ వేడుక‌ని క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. ప‌లువురు కృష్ణులు ఉట్టి కొట్టి సంద‌డి చేశారు. త‌మ స్కూల్లో చ‌దువుతోపాటు అన్నీ పండుగ‌ల‌ను, ఉత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుతామ‌ని విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ స‌త్య‌నారాయ‌ణ తెలిపారు….

Read More