
సంగంలో పొలం పిలుస్తోంది…
నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక ఆంజనేయస్వామి గుడి ఆవరణలో వ్యవసాయాధికారి శ్రీహరి, ఏ డీ ఏ మారుతీ దేవిలు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. నీటి యాజమాన్య పద్ధతుల గురించి వారికి వివరించారు. అదే విధంగా రబీ సీజన్లో పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పిన సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు.