సంగంలో పొలం పిలుస్తోంది…

నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక ఆంజనేయస్వామి గుడి ఆవరణలో వ్యవసాయాధికారి శ్రీహరి, ఏ డీ ఏ మారుతీ దేవిలు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు, సల‌హాలు చేశారు. నీటి యాజమాన్య పద్ధతుల గురించి వారికి వివరించారు. అదే విధంగా రబీ సీజన్లో పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పిన సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు.

Read More

నాయుడుపేట‌లో వేలం పాట‌

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలోని శ్రీకాళహస్తిశ్వర వేణుగోపాలు స్వామి భూములను కౌలుకు దేవాదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. సంత్సర కాలానికి 19ఎకరాలను బహిరంగంగా వేలం ద్వారా పలువురు రైతులు దక్కించుకున్నారని ఈవో రవి కృష్ణా తెలిపారు. ఈ వేలం ద్వారా లక్షా యాబైవేల వంద రూపాయలు దేవస్థానానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Read More

సంగంలో రోడ్డు ప్ర‌మాదం

నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ వైపు వస్తున్న బైకును వెనుకవైపు నుండి వేగంగా టాటా ఏస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ లో ఉన్న ఓ వ్యక్తికి.. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More

అమ‌ర‌జీవి సేవలు చిరస్మరణీయం

శ్రీ పొట్టి శ్రీ‌రాములు అమ‌ర‌జీవికి ఘ‌న నివాళులు నెల్లూరులో 69వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజ‌కీయ పార్టీల నాయ‌కులు, మేధావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జ‌న‌సైనికుల‌తో క‌లిసి అమ‌ర‌జీవి…

Read More

అమ‌ర‌జీవి చూపిన మార్గాన్ని యువ‌త ఆచ‌రించాలి

తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన వారు అమరజీవి పొట్టిశ్రీరాములు అని న‌గ‌ర మేయ‌ర్ పోట్లూరి స్ర‌వంతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న‌గ‌రంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి ఆమె పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మీడియాతో మాట్లాడుతూ…ఈ రోజు వారు చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ వారికీ ఘన నివాళి అర్పించడం జరిగింది అన్నారు. అమ‌ర‌జీవి…

Read More

ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా వ్య‌వ‌హ‌రించాలిలేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌

నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌ల పంచాయతీలోని తుమ్మ‌గుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి 5వ పెన్ష‌న్ల‌ను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి.. అవ్వ‌.. తాతల‌తోపాటు అర్హులైన‌న పెన్ష‌న్ దారుల‌కు ఆమే స్వ‌యంగా పింఛ‌న్లు అందించారు. అంతేకాకుండా.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సాద‌కబాధ‌లు అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికుల‌తోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌లను కొంద‌రు ప్ర‌శాంతిరెడ్డి దృష్టికి తెచ్చారు. ప్ర‌ధానంగా పంచాయ‌తీ అధికారులు, విద్యుత్ ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను…

Read More

దీపం-2తో 4,06,552 మందికి ల‌బ్ధి

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ్యూహాత్మకంగా సుప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ అన్నారు. నెల్లూరు 9వ డివిజ‌న్‌లో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని మంత్రి అట్ట‌హాసంగా ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. దీపం 2.0 ప‌థ‌కానికి అర్హులైన వారంద‌రికీ ఉచితంగా సిలిండ‌ర్ల‌ను పంపిణీ చేశారు. గ్యాస్ బండిని జెండా ఊపి ప్రారంభించారు. ల‌బ్ధిపొందిన వారితో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు,…

Read More

థ‌ట్ ఈజ్ ప్రశాంతిరెడ్డి

ఊరిని స‌రిగా చూసుకోక‌పోతే.. చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు చేస్తాంచౌక‌చ‌ర్ల గ్రామ స‌ర్పంచ్ అళ‌గ‌రి వినోద్‌కుమార్ కు వార్నింగ్‌ ఇచ్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి

Read More

నాయుడుపేట‌లో తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

బ‌స్‌కు అడ్డుగా వ‌చ్చిన బైక్‌పై వెళుతున్న వ్య‌క్తి బ‌స్‌డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో యువ‌కుడికి త‌ప్పిన ప్ర‌మాదం తిరుపతి జిల్లా నాయుడుపేట ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంతో బైక్ పై వెళ్తున్న యువకుడుకి ప్రమాదం తప్పింది. ఉద్యోగులను విధులకు తీసుకుపోతున్న బస్ కు బైక్ అడ్డు రావడంతో ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళుతున్న యువకుడికి స్వల్పగాయాలు కావడంతో ట్రినిటీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్ర‌మాదం జ‌రిగిన దృశ్యాలు బ‌స్‌లోని…

Read More

రైతులకు సహాయం చేసిన పోలీసులు

విద్యుత్ మోటర్ల కొనుగోలు చేయాలంటే రైతులకి ఇబ్బంది అని… కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని రైతులకు సహాయం చేసిన కోణంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని….నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య చెప్పారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తో కలిసి ASP మీడియాతో మాట్లాడారు….కృష్ణపట్నం సర్కిల్ పరిధిలో గత కొద్దిరోజులుగా వరి పొలాలు, రొయ్యల గుంటల వద్ద విద్యుత్ మోటార్ దొంగతనాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు….

Read More