డిసెంబ‌ర్ 14,15తేదీల్లో సీపీఎం 25 మ‌హాస‌భ‌లు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండ‌లంలో డిసెంబ‌ర్ 14,15 తేదీల‌లో సీపీఎం 25వ మ‌హాస‌భ‌లు జ‌రుగుతాయ‌ని మండ‌ల కార్య‌ద‌ర్శి కోటేశ్వ‌ర‌రావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం నేత‌లు మండ‌లంలో ప‌ర్య‌టిస్తూ…ఇంటింటికెళ్లి మీ వంతు ఆర్ధిక స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని…సీపీఎం 25వ మ‌హాస‌భ‌ల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని వారు కోరారు. అనంత‌రం కోటేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ… నిరంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సీపీఎం పార్టీ ఎన్నో ఉద్య‌మాలు, పోరాటాలు చేస్తోంద‌ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయ‌కులు వాసు, ద‌యాసాగ‌ర్‌, పేడూరు మ‌ల్లికార్జున‌,…

Read More

తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్…

వాకాడు మండ‌లం దుగ‌రాజప‌ట్నం గ్రామ పంచాయ‌తీలోని శ్రీ‌నివాసపురం గ్రామంలో మ‌ద్యం మ‌త్తులో క‌న్న‌తండ్రినే కుమారుడు క‌ర్ర‌తో దాడి చేసి చంపేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై వాకాడు పోలీసుస్టేష‌న్లో కేసు న‌మోదు చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టి…ముద్దాయి ర‌మేష్‌ను శ్రీ‌నివాసపురంలో అరెస్ట్ చేసిన‌ట్లు సీఐ హుస్సేన్‌బాషా తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న స‌ర్కిల్ పోలీసు కార్యాల‌యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించి కేసుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు. నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని…రిమాండ్‌కు త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. ఈ…

Read More

కోవూరులో వైభ‌వంగా కార్తీక మాసం

నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకొని…భ‌క్తులు శివ‌నామ స్మ‌ర‌ణ‌ల‌తో ఆల‌యంలో ప్ర‌ద‌క్ష‌ణాలు చేసి స్వామి వారిని ద‌ర్శించుకొని తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

Read More

టైంకి షాపులు మూసేయాలి…

నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ద‌ర్గా ప్రాంతంలో ఎస్ఐ ఏ సైదులు త‌న సిబ్బందితో క‌లిసి త‌నిఖీలు చేప‌ట్టారు. ద‌ర్గాకి విచ్చేసే భ‌క్తులు, యాత్రికుల‌కి ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాత్రి స‌మ‌యంలో బీట్ పోలీసు సిబ్బంది విధుల‌ను ఎస్ఐ స్వ‌యంగా ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. దుకాణ‌దారులంద‌రూ త్వ‌ర‌గా మూసి వేయాల‌ని ఆదేశించారు. ఎవ‌రైనా నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పనితీరు పట్ల…

Read More

జిల్లాలో మరొక ఎన్నికల సంగ్రామం

సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల కు జిల్లా అధికారయంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రైతులు ప్రతిష్టాత్మకంగా తీసుకునే నీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నంవబర్ 21 విడుదల కానుండగా…. ఎన్నికల నిర్వహణ లో కీలక ఘట్టాలైన ఓటరు నమోదు…. ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబందిత శాఖల అధికారులకు ట్రైనింగ్ సైతం పూర్తి అయ్యింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి….జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ….సాగు నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్న…

Read More

నాయుడుపేట ఎన్టీఆర్‌కాల‌నీలో కార్టెన్‌సెర్చ్‌

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పరిశ్రమవాడలో డీఎస్పీ చెంచుబాబు కార్టెన్‌స‌ర్చ్‌ నిర్వహించారు. ఎన్టీఆర్ కాలనీలో ఎక్కువగా నివసిస్తున్న ఇతర రాష్ట్రాల‌ కార్మికుల ఇళ్లలో అడుగ‌డుగున సోదా చేశారు. ఆ ప్రాంతంలోని అన్ని వాహనాల పత్రాలు, పరిసరప్రాంతాలలో క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి ఆధ్వ‌ర్యంలో కార్మికులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రధానంగా మాదక ద్రవ్యాలు, అపరిచిత వ్యక్తులు, అనుమానిత వాహనలను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు చేప‌ట్టిన‌ట్లు డీఎస్పీ చెంచుబాబు తెలియ‌జేశారు.

Read More

టీడీపీ నేత‌ల‌పై ఎంపీ ఫైర్‌

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నాయకులపై వైసీపీ ఎంపీగురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఫైర్ అయ్యారు. పెళ్ల‌కూరు మండ‌లం చిల్ల‌కూరు గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులు సహకారంతో వైసీపీ నాయకులపై హత్యలకి‌ పాల్పడయతున్నారంటూ మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్త హత్యపై హైకోర్టు ఉత్తర్వులను సైతం పోలీసులు ఉల్లంఘిస్తున్నారంటూ కిలివేటి అగ్రహాం వ్యక్తం చేశారు. పెళ్లకూరు మండలం చిల్లకూరులో వైసీపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు…

Read More

పాత క‌క్ష‌ల‌తోనే హ‌త్య‌

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో దీపావళి రోజు జరిగిన హ‌త్య కేసు విష‌యంలో ముగ్గురు నింధితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు మై డీఎస్పీ రమణ కుమార్ తెలియ‌జేశారు. చిల్ల‌కూరు పోలీస్‌స్టేష‌న్‌లో మృతుడు ఎర్రిపాక వెంకటేష్ హ‌త్య‌కు సంబంధించిన నింధితుల‌ను మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టి విలేక‌రుల‌తో డిఎస్పీ వివ‌రాలు వెల్ల‌డించారు. కడివేడు గ్రామంలో జరిగిన హత్యకు సంబంధించి ముగ్గురు నింధితుల‌ను అరెస్ట్ చేశామ‌న్నారు. పాత గొడవల కార‌ణంగా పగబెట్టుకొని మరి దారుణంగా దాడి చేసి హ‌త‌మార్చిన‌ట్లు తెలిపారు….

Read More

నెల‌క్యాస్ట్ క‌ర్మాగారంలో వ్య‌క్తి మృతి

తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని నెల క్యాస్ట్ కర్మాగారంలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతిమృతి చెందాడు. మృతి చెందిన నెల్లూరు జిల్లా కోవూరు వాసిగా మల్లెల గోపికృష్ణ గా పోలీసులు గుర్తించారు. కోర్ బాక్స్ క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తల ఇరుక్కుని మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. దీనిపై గూడూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Read More

మాలల మహా గర్జనను జయప్రదం చేయండి

నవంబర్ 4వ తేదీన అల్లూరు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న మాలల మహా గర్జన సభను జయప్రదం చేయాలని అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర నాయకులు ముసలి నరేంద్ర, ఎల్లు సాల్మన్ రాజు కోరారు. ఈ మేరకు అల్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాలల కాలనీలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను విడగొట్టే ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు క్రిమిలేయర్ వంటి వాటిపై…

Read More