సూళ్లూరుపేట శివాలయంలో భ‌క్తులు కిట‌కిట‌

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ గంగా పార్వతి సమేత త్రినేత్ర సంభూతుడైన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల‌చవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్తీకమాసం ఐదవ రోజు పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీకమాస దీపం పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి వేడుకలలో పుట్ట వద్ద ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో తిరిగి పుట్ట ద‌ర్శ‌నం అనంత‌రం ఉప‌వాస‌దీక్ష‌ను భ‌క్తులు విర‌మించారు. ఈ సంద‌ర్భంగా…

Read More

సిటీ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కార్పొరేట‌ర్లు

నెల్లూరు న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాల‌యంలో…న‌గ‌ర మేయ‌ర్ పోట్లూరి స్ర‌వంతి అధ్య‌క్ష‌త‌న కౌన్సిల్ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్లు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌పై కౌన్సిల్ స‌మావేశంలో గ‌ళ‌మెత్తారు. ఈ క్ర‌మంలో వైసీపీ, టీడీపీ కార్పొరేట‌ర్ల మ‌ధ్య వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. నువ్వెంత అంటే…నువ్వెంత…

Read More

హ‌ఠాత్తుగా సునామీ వ‌స్తే…మ‌నం ఏం చేయాలో తెలుసా…?

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్రం తీరం వ‌ద్ద‌… ఏపీఎస్ డిఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 9వ బెటాలియన్ వెంకటగిరి సునామీపై మాక్ డ్రిల్ నిర్వ‌హించారు. సునామి హఠాత్తుగా సంభవించినప్పుడు తీసుకోవాల్సిన‌ జాగ్రత్తలపై ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ,ఎస్డిఆర్ఎఫ్ బృందాలు చే ప్రజలకు అవగాహన కల్పించారు. అనంత‌రం త‌హ‌సీల్దార్ రామ‌య్య మాట్లాడారు. సునామీ వంటి విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు ఏ విధంగా ర‌క్షించుకోవాల‌న్న దానిపై మాక్ డ్రిల్ నిర్వ‌హించ‌డం…

Read More

కోరిన కోరికలు తీర్చే నాగేంద్ర స్వామి నాగుల పుట్ట…

కోవూరులో వైభవంగా నాగుల చవితి వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు NTS గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానంలో నాగుల చవితి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నాగుల పుట్టలో పాలు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నాగుల పుట్టకు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉందని భక్తులు తెలిపారు. రావి చెట్టు యాప చెట్టు…

Read More

వింజ‌మూరులో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగేంద్రుడికి భ‌క్తులు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా వింజ‌మూరు మండ‌లంలో నాగుల చ‌వితి పండుగ వైభ‌వంగా జ‌రిగింది. మండ‌లంలోని ఊటుకూరు ప్రాంతంలో నాగేంద్రు స్వామి పుట్ట‌కి భ‌క్తులు విశేష పూజ‌లు చేశారు. మ‌హిళలు పుట్ట చుట్టూ దారం చుట్టి ప్ర‌ద‌క్ష‌ణాలు చేసి…పాలుపోసి…స్వామి వారికి నైవేధ్యాలు స‌మ‌ర్పించారు. మహిళలు ఉపవాసాలు ఉంటూ నిండు మనుసుతో ఆ నాగేంద్రునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Read More

ఇందుకూరుపేట‌లో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగుల పుట్ట‌ల‌కు భ‌క్తులు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేటలో నాగుల చ‌వితి పండుగ‌ను భ‌క్తులు వైభ‌వంగా నిర్వ‌హించారు. మండ‌లంలోని నాగులమ్మ‌ పుట్ట‌ల‌కు భ‌క్తులు పుట్ట చుట్టూ దారం చుట్టి…పాలు పోసి…నైవేధ్యాలు సమ‌ర్పించి దీపారాధ‌న చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాగుల చ‌వితి విశిష్ఠ‌త‌ను…గిరిధర్ స్వామి, సత్య కృష్ణ స్వామి, మురళీకృష్ణ స్వామి మీడియా ద్వారా తెలియ‌జేశారు.

Read More

సంగంలో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగ‌శిల‌ల‌కు పాల‌తో అభిషేకం చేసిన భ‌క్తులు నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో నాగుల చవితి పండుగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సందర్భంగా భక్తులు నాగ శిలల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగ శిలలకు పాలతో అభిషేకం నిర్వహించి..శిలల వద్ద ఉన్న చెట్టుకు దారం కట్టి మొక్కుకున్నారు. అనంతరం సజ్జలు,పిండి ప్రసాదంగా పంచి పెట్టారు.

Read More

బ‌ధిరులు, అంధుల‌కి మొబైల్స్, లాప్ టాప్స్ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బధిరులు, అంధులకు జిల్లా కలెక్టర్ ఆనంద్‌ చే మొబైల్ ఫోన్స్, లాప్ టాప్ ల పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బధిర, అంధ విద్యార్థిని విద్యార్థులకు మొత్తం 3,95,000 రూపాయల విలువ కలిగిన 10 మొబైల్ ఫోన్లు, 7 లాప్ టాప్ లను విభిన్న ప్రతిభా వంతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తిభా వంతుల శాఖ అధికారులు, క‌లెక్ట‌రేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More

వర్గీకరణ వద్దు..ఐక్యతే ముద్దు…

ఎస్వీ వర్గీకరణ వద్దని… ఎస్సీలంతా కలిసి ఉండటమే ముద్దుగా ఉంటుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులో జరిగిన మాలల మహా గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎస్సీలను విడగొట్టాలన్న ప్రయత్నం చేస్తుందని విమ‌ర్శించారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఎస్సీ…

Read More

ఆ బాధ్య‌త మాతోపాటు అధికారుల‌పై ఉంది – ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఇప్పుడున్నది ప్రజల కోసం పనిచేస్తున్న మంచి ప్రభుత్వం అని…ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాతో పాటు అధికారులపై ఉందని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ప్రత్యేక ప్రజావిజ్ఞాపనల కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆర్డీవో నాగ సంతోష్ అనూష, మండ‌ల అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి ప్ర‌తీ ఒక్క‌రిని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించి స‌మ‌స్య‌ల‌పై ఆరా…

Read More