అల్లూరులో ఘనంగా కార్తీక దీపోత్సవం

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అల్లూరులోని శివాలయంలో మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా వేలాది సంఖ్యలో మహిళా భక్తులు, అయ్యప్ప మాలదారులైన స్వాములు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భ‌క్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. అదేవిధంగా మండలంలోని నార్త్ మోపూరు, ఇసుకపల్లి గోగులపల్లి గ్రామాల్లో వెలసిన శివాలయంలో స్థానిక మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి కార్తీకదీపం వెలిగించి…

Read More

హ‌ర హ‌ర మ‌హాదేవ.. శంభోశంక‌ర‌..!!

కార్తీకదీపోత్స‌వం సంద‌ర్భంగా నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ఆయ‌న సోద‌రులు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డిలతోపాటు సింహ‌పురి కార్తీక దీపోత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రంలోని గ‌ణేష్ ఘాట్‌వ‌ద్ద మ‌హా కార్తీక దీపోత్స‌వం, మ‌హిళా శోభాయాత్ర అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. సాయంత్రం ఐదు గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల‌వర‌కు గ‌ణేష్ ఘాట్ ప్రాంగ‌ణం అంతా ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి ద‌గ్గ‌రుండి ఆయా కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా అంత‌రాలు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముందుగా…

Read More

స్వ‌లాభం కోసం త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు

తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆర్మీలపాడు క్వారీఫై కొంతమంది వ్యక్తులు స్వలాభం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీఈఓ శ్రీనివాస్ సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో ఉన్న క్వరీలకు లేని షరత్తులు తమకు మాత్రమే ఆపాదించడం సరైన పద్దతి కాదని అన్నారు.గ్రామానికి,ప్రకృతి వనరులకు నష్టం జరగకుండా క్వారీని నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు అన్ని రకల శాఖల అధికారుల అనుమతులు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. నాయుడుపేటలోని తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామానికి,వ్యవస్థలకి,పర్యావరణ సంరక్షణకి కట్టుబడి…

Read More

జ‌హీర్‌కు టీడీపీ నేత‌లు ప‌రామ‌ర్శ

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీవ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న‌లో.. తీవ్రంగా గాయ‌ప‌డి.. నెల్లూరు అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌ను టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, రాష్ట్ర‌ వ‌క్ఫ్‌బోర్డు ఛైర్మ‌న్ అబ్ధుల్ అజీజ్‌, ఇత‌ర టీడీపీ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. దాడికిగ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం కోటంరెడ్డి, అజీజ్‌లు మీడియాతో మాట్లాడుతూ…..

Read More

హైపెక్ స‌ర్జ‌రీల‌కి కేంద్ర బిందువు నెల్లూరు మెడిక‌వ‌ర్‌

మహానగరాలకు ధీటుగా క్యాన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందించడంలో నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముందుందని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరులోని మెడి కవర్ హాస్పిటల్స్ లో జరిగిన జాతీయ క్యాన్సర్ దినోత్సవ కార్య‌క్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ ర‌మేష్ బాబుతోపాటు…కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ , రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరికాంత్ లు మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు క్యాన్సర్ వ్యాధి నివారణకు పలు సూచనలు చేశారు. వైద్య…

Read More

పథకాలు అమలుపై కలెక్టర్ ఆరా…!

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. క్షేత్రస్థాయిలోపథకాలు అమలును స్వయంగా సందర్శించారు. వెలకపాడులో నిర్మాణంలో ఉన్న గోకులం షెడ్డు ను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాడి పశు పోషణ లాభనష్టాలను తెలుసుకున్నారు. అదే విధంగా స్థానిక సమస్యలను అడగగా చెరువుకు సోమశిల నీరు రానివ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ కాలువల నిర్మాణం చేయించాలని కోరగా, ప్రాదాన్యత ప్రకారం మంజూరు చేస్తామని కలెక్టర్…

Read More

పిల్ల‌ల‌కి రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలి…

జిల్లాలో సుమారు 80 కోట్లతో ఉపాధి హామీ పథకం కింద పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలాల్లో క‌లెక్ట‌ర్‌ పర్యటించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం వింజమూరు మండలం నంది గుంటలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. నంది గుంటలోని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ కేంద్రాన్ని సందర్శించి…

Read More

ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండ‌ర్లు

దీపం-2 ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లను ప్ర‌భుత్వం పంపిణీ చేస్తోంద‌ని… చిత్తూరు క‌లెక్ట‌ర్ విద్యాధ‌రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిత్తూరులో క‌లెక్ట‌రేట్‌లో ఆమె మీడియా స‌మావేశం నిర్వ‌హించి దీపం -2 ప‌థ‌కానికి స‌బంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేశారు. డిసెంబర్ నుండి మార్చి వరకు ఒక సిలిండర్, ఏప్రిల్ నుండి జూలై వరకు ఒక సిలిండర్, ఆగస్టు నుండి నవంబర్ వరకు ఒక సిలిండర్ చొప్పున ఉచిత రీఫిల్లింగ్ చేసుకోవాల‌ని తెలిపారు. బి పి ఎల్…

Read More

న‌వంబ‌ర్ 16న సోమేశ్వ‌రాల‌య పునఃనిర్మాణ శంఖుస్థాప‌న‌

నెల్లూరు జిల్లాలోని సోమశిల గ్రామంలో స్వయంభుగా వెలిసి ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలొని పలు ప్రాంతాలు గతంలో వచ్చిన వరదలకు ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 16వ తేదీ సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర దేవాలయం పునర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగేరి పీఠాధిపతి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కమిషనర్…

Read More

జిల్లా ప్ర‌జ‌లంద‌రూ ప‌ర‌మేశ్వ‌రుడి ఆశీస్సులు పొందాలి

వీపీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో…న‌వంబ‌ర్‌ 8, 9, 10వ తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతాయ‌ని..కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్‌ వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరు నగరం వి. ఆర్‌. సి మైదానంలో జ‌రుగుతున్న కార్తీక ల‌క్ష దీపోత్స‌వ ఏర్పాట్ల‌ను ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డితో క‌లిసి ఆమె ప‌రిశీలించారు. ల‌క్ష దీపోత్స‌వంలో పాల్గొనే భ‌క్తులంద‌రికి ఎక్క‌డా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవాల‌ని వేమిరెడ్డి దంప‌తులు…క‌మిటీ స‌భ్యుల‌కి సూచించారు….

Read More