18 దుకాణాల‌కి 214 ద‌ర‌ఖాస్తులు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 18 మ‌ద్యం దుకాణాల‌ను క‌ల్లుగీత కార్మికుల‌కి రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. 18 దుకాణాల కోసం 213 ద‌ర‌ఖాస్తులు చేసుకోగా, మ‌ద్యం దుకాణాల కేటాయింపుకు లాట‌రీ డ్రా నిర్వ‌హించారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో మ‌ద్యం దుకాణాల ల‌క్కీ డిప్ కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్ కార్తీక్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గీత కార్మికుల కులాలు, ఉప కులాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌దారుల ద‌ర‌ఖాస్తులను ల‌క్కీ డిప్ తీసి…పేర్ల‌ను ప్ర‌క‌టించి దుకాణాల‌ను కేటాయించారు….

Read More

ఆ హాస్ట‌ల్‌లో ఏం జ‌రిగింది..?

తిరుపతి జిల్లా గూడూరులో ఇద్దరు బాలికల మిస్సింగ్ కలకలం రేపింది… రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలోని గిరిజన గురుకుల హాస్టల్ నుండి బాలికలు ఇద్దరు అదృశ్యం అయ్యారు..బాలికలు పదో తరగతి చదువుతున్న జయశ్రీ ,చందన గా గుర్తించారు… జయశ్రీ స్వస్థలం సైదాపురం ,చందన స్వస్థలం నెల్లూరు ఎన్టీఆర్ నగర్ గా తెలుస్తుంది… విద్యార్థినిల అదృశ్యంపై హాస్టల్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా సోమ‌వారం రాత్రి పోలీసులు ఆ హాస్టల్ కు…

Read More

బీద మస్తాన్ రావు అనే నేను

నెల్లూరు జిల్లా వాసి, పారిశ్రామిక వేత్త, డాక్టర్ బీద మస్తాన్ రావు ఢిల్లీలోని పెద్దల సభలో రాజ్యసభ సభ్యునిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభంకాగానే చైర్మన్ జగదీప్ దినకర్ బీద మస్తాన్ రావు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2022 జులై 18 వ తేదీన అప్పటి వైసిపి మద్దతుతో ఆయన తొలిసారిగా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఆయనను రాష్ట్రంలోని కూటమి పెద్దలు తిరిగి…

Read More

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించను

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయకుండా, గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా పర్యవేక్షించాలని, ప్రణాళికా బద్ధంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరపాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. నెల్లూరు నగరం 2 వ డివిజన్ పరిధిలోని 4 సచివాలయాలకు సంబంధించిన సిరి గార్డెన్, నరుకూరు, ఎస్. ఎల్. వి. రాయల్ ఎస్టేట్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ సోమవారం పర్యటించారు. నగరపాలక సంస్థకు చెందిన స్థలాల్లో పార్కుల…

Read More

భ‌రోసా ఇస్తున్నా.. ప‌ట్టాదారు పుస్త‌కాలు ఇప్పిస్తా..!

-క‌లెక్ట‌రేట్‌లో పురుగుల మందు తాగ‌బోయిన ఓ రైతు-అడ్డుకున్న క‌లెక్ట‌ర్‌, అధికారులు-ప‌ట్టాదారు పాస్‌పుస్త‌కాలు ఇవ్వ‌డంలేదంటూ ఆదేద‌న వ్య‌క్తం చేసిన రైతు-స‌త్వ‌ర న్యాయం చేసేలా క‌లెక్ట‌ర్ ఆనంద్ నిర్ణ‌యం త‌న పొలంకు సంబంధించిన పాస్‌పుస్త‌కాలు ఇవ్వ‌డంలేదని.. అడిగితే.. నిర్ల‌క్ష్యంగా స‌మాధానం చెప్తున్నారంటూ.. మ‌న‌స్థాపానికి గురైన ఓ రైతు క‌లెక్ట‌రేట్ వ‌ద్క‌ద‌కు పురుగుల మందుతో వ‌చ్చి.. న్యాయం జ‌ర‌క్క‌పోతే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌తానంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పొద‌ల‌కూరు మండ‌లం.. బిర‌ద‌వోలుకు చెందిన మోడిబోయిన వెంక‌ట‌రమ‌ణ‌య్య అనే రైతుకు 20.32 ఎక‌రాల పొలం…

Read More

సంగంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయం,ఎంపీడీఓ కార్యాలయం లో తహసీల్దార్ సోమ్లా నాయక్,ఎంపీడీఓ షాలెట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పలు సమస్యల పై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.పరిశీలించి సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అన్నీ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Read More

పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలి..

విద్యుత్ చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ లను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ A.E కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గా సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెరగడంతో ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచమని, తగ్గిస్తామని ఎన్నికలో టీడీపి…

Read More

జ‌గ‌న్ పాల‌న‌పై క‌విత‌లు చ‌దివిన సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాల‌యంలో…స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌… జగన్ పాలనలో దోపిడీ, కబ్జాలపై కవితలు చదివి వినిపించారు. 104, 108 అంబులెన్సు సర్వీసెస్ ను జీవికే నుండి తీసుకున్న అరబిందో భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. జీవికే సంస్థకు ఇస్తున్న డబ్బు కంటే డబుల్ చేసి దోపిడీకి పాల్పడ్డట్టు నిర్దారణ అయ్యిందన్నారు. రోహిత్ రెడ్డి మైంటైన్ చేసి దోపిడీ చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలన్నారు. ప్రజల…

Read More

బుచ్చి స‌చివాల‌యం ఖాలీ

బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సచివాలయం 3 ఖాళీగా దర్శనమిస్తుంది. సచివాలయంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రజలు పనిపై వెళ్లి వెనక్కి తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం సర్వే చేపట్టమని ఆదేశాలు జారీ చేసే విషయం తెలిసిందే. అయితే సచివాలయంలో కనీసం ఒక అధికారి కూడా లేకుండా అందరూ వెళ్లిపోవడం ఏమిటని ప్రజల ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రజలకు నిరంతరం సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read More

జగనన్న లే ఔట్ లో వ్యక్తి అనుమానస్పద మృతి

నెల్లూరు జిల్లా కావలి పట్టణ సమీపంలోని ముసునూరు జగనన్న లే ఔట్ లో వ్యక్తి మృతి శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు హుటాహుటీన సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ముసునూరు వద్దనున్న అట్టలప్యాక్టరీలో నివాసం ఉంటున్న శాంతి కుమార్ గా గుర్తించారు. అతని చొక్కా రక్తంతో తడిసి ఉంది.కానీ ఎలాంటి రక్త గాయాలు లేవని, ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విషయం…

Read More