N3staff1

దీపం-2తో 4,06,552 మందికి ల‌బ్ధి

అర్హులైన వారికి ఉచిత సిలిండర్లు అంద‌జేత‌ మంత్రి నారాయ‌ణ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన ల‌బ్ధిదారులు నెల్లూరులో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని ప్రారంభించిన నారాయ‌ణ‌ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ్యూహాత్మకంగా సుప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ అన్నారు. నెల్లూరు 9వ డివిజ‌న్‌లో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని మంత్రి అట్ట‌హాసంగా ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు….

Read More

తండ్రిని చంపిన కొడుకు

వాకాడులో దారుణం తిరుపతి జిల్లా వాకాడు మండలం శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది… మద్యం మత్తులో కన్నతండ్రి చిన్నరామయ్యపై కుమారుడు రమేష్ విచక్షణారహితంగా కర్రతో దాడి చేయడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు… చిన్నపాటి వివాదం కారణంగా క్షణికావేశంలో తండ్రిపై దాడికి పాల్పడి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు… గిరిజన కాలనీలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More

ఉద‌య‌గిరిలో వేలం పాట‌లు…!

15వేలుకు మొద‌లై రూ. 10.12వేల‌కు ముగిసిన పాట పంచాయతీ ఆదాయ వనరుల కోసం ఉదయగిరి గ్రామపంచాయతీలో వివిధ రకాల వేలం పాటలు జ‌రిగాయి. సర్పంచ్ పావులూరి సామ్రాజ్యం, ఉప సర్పంచ్ షేక్. ముర్తుజా హుస్సేన్ పంచాయతీ కార్యదర్శి కరిముల్లాలు వేలం పాటలు నిర్వహించారు. రూ. 15వేల నుంచి మొదలైన వేలం పాట రూ. పది లక్షల 12 వేలకు ముగిసింది. పదిలక్షల 12 వేల రూపాయలకు షేక్ ఖలీద్ దక్కించుకున్నట్లు పంచాయతీ ఈవో,షేక్ కరిముల్లా తెలిపారు. అయితే…

Read More

అమ‌ర‌జీవి చూపిన మార్గాన్ని యువ‌త ఆచ‌రించాలి

తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన వారు అమరజీవి పొట్టిశ్రీరాములు అని న‌గ‌ర మేయ‌ర్ పోట్లూరి స్ర‌వంతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న‌గ‌రంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి ఆమె పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మీడియాతో మాట్లాడుతూ…ఈ రోజు వారు చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ వారికీ ఘన నివాళి అర్పించడం జరిగింది అన్నారు. అమ‌ర‌జీవి…

Read More

ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా వ్య‌వ‌హ‌రించాలిలేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌

నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌ల పంచాయతీలోని తుమ్మ‌గుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి 5వ పెన్ష‌న్ల‌ను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి.. అవ్వ‌.. తాతల‌తోపాటు అర్హులైన‌న పెన్ష‌న్ దారుల‌కు ఆమే స్వ‌యంగా పింఛ‌న్లు అందించారు. అంతేకాకుండా.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సాద‌కబాధ‌లు అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికుల‌తోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌లను కొంద‌రు ప్ర‌శాంతిరెడ్డి దృష్టికి తెచ్చారు. ప్ర‌ధానంగా పంచాయ‌తీ అధికారులు, విద్యుత్ ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను…

Read More

థ‌ట్ ఈజ్ ప్రశాంతిరెడ్డి

ఊరిని స‌రిగా చూసుకోక‌పోతే.. చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు చేస్తాంచౌక‌చ‌ర్ల గ్రామ స‌ర్పంచ్ అళ‌గ‌రి వినోద్‌కుమార్ కు వార్నింగ్‌ ఇచ్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి

Read More

నాయుడుపేట‌లో తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

బ‌స్‌కు అడ్డుగా వ‌చ్చిన బైక్‌పై వెళుతున్న వ్య‌క్తి బ‌స్‌డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో యువ‌కుడికి త‌ప్పిన ప్ర‌మాదం తిరుపతి జిల్లా నాయుడుపేట ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంతో బైక్ పై వెళ్తున్న యువకుడుకి ప్రమాదం తప్పింది. ఉద్యోగులను విధులకు తీసుకుపోతున్న బస్ కు బైక్ అడ్డు రావడంతో ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళుతున్న యువకుడికి స్వల్పగాయాలు కావడంతో ట్రినిటీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్ర‌మాదం జ‌రిగిన దృశ్యాలు బ‌స్‌లోని…

Read More

ప్ర‌మాద‌క‌రంగా హోర్డింగ్‌లు…

భ‌యాందోళ‌న‌లో విద్యార్థులు, ప్ర‌యాణికులు ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కేంద్రంలో వివిధ ప్రైవేటు హాస్పిటల్ కు సంబంధించిన ప్రచార హోర్డింగులు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. వెంకటగిరి – గూడూరు రోడ్డు మార్గ మధ్యలో బాలాయపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భాగంలో, బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణం ముందు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌ల కార‌ణంగా విద్యార్థులు ,ప్రయాణికులకు అటువైపు వచ్చు వాహనాలు కనబడక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. పంచాయ‌తీ అధికారుల అనుమ‌తి…

Read More

సూళ్లూరుపేట‌లో పెన్ష‌న్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పలు ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి పట్టణ టిడిపి నాయకులు, సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ చేతుల మీదుగా 15వ వార్డు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం స్థానికుల ఆరోపణ మేరకు బండారురాజా వీధి సైడ్ కాలువ దుస్థితి పరిశీలించారు. త్వరలో రోడ్డు ప్రక్రియను మొదలుపడతామని హామీ ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ…

Read More