N3staff1

కుప్పంలో వైసీపీ భారీ షాక్‌…

చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ త‌గిలింది. కుప్పం మున్సిప‌ల్ చైర్మ‌న్ డాక్ట‌ర్ సుధీర్ వైసీపీ రాజీనామా చేసి…తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్ర‌బాబు నాయుడును డాక్ట‌ర్ సుధీర్‌ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. సుధీర్‌కి సీఎం చంద్ర‌బాబు పార్టీ కండువా క‌ప్పి టీడీపీలో సాద‌రంగా ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబుతో…

Read More

ఇందుకూరుపేట‌లో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగుల పుట్ట‌ల‌కు భ‌క్తులు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా కోవూరు నియోజ‌క‌వ‌ర్గం ఇందుకూరుపేటలో నాగుల చ‌వితి పండుగ‌ను భ‌క్తులు వైభ‌వంగా నిర్వ‌హించారు. మండ‌లంలోని నాగులమ్మ‌ పుట్ట‌ల‌కు భ‌క్తులు పుట్ట చుట్టూ దారం చుట్టి…పాలు పోసి…నైవేధ్యాలు సమ‌ర్పించి దీపారాధ‌న చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా నాగుల చ‌వితి విశిష్ఠ‌త‌ను…గిరిధర్ స్వామి, సత్య కృష్ణ స్వామి, మురళీకృష్ణ స్వామి మీడియా ద్వారా తెలియ‌జేశారు.

Read More

సంగంలో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగ‌శిల‌ల‌కు పాల‌తో అభిషేకం చేసిన భ‌క్తులు నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని సంగమేశ్వరాలయంలో నాగుల చవితి పండుగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ సందర్భంగా భక్తులు నాగ శిలల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగ శిలలకు పాలతో అభిషేకం నిర్వహించి..శిలల వద్ద ఉన్న చెట్టుకు దారం కట్టి మొక్కుకున్నారు. అనంతరం సజ్జలు,పిండి ప్రసాదంగా పంచి పెట్టారు.

Read More

క‌లెక్ట‌ర్ సార్‌…మీరైనా న్యాయం చేయండి

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినిని ఓ మోస‌గాడు మోసం చేసి అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాప్ర‌య‌త్నానికి కారకుడైన మోసగాడు హాసన్ ను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయ‌కుల‌తో క‌లిసి బాధిత కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ఆనంద్‌ని క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌చేశారు. అర్జీ తీసుకున్న కలెక్టర్ విచారణ జరిపి బాధితురాలికి…

Read More

మ‌హాద్భుతంగా మ‌హా కార్తీక దీపోత్స‌వం

కార్తీక మాసం పుర‌స్క‌రించుకొని ….సింహ‌పురి కార్తీక దీపోత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో కార్తీక మ‌హా దీపోత్స‌వాన్ని నవంబ‌ర్ 15న మ‌హాద్భుతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇరుక‌ళ‌ల ప‌ర‌మేశ్వ‌రి ఆల‌య అర్చ‌కుల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ…ఉదయం శోభ యాత్రతో ప్రారంభించి… హరిద్వార్ నుండి వచ్చిన ఐదు మంది అర్చకుల చేత గంగా హారతి నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. అదే విధంగా 108 తెప్పలతో శివాకృతి నెల్లూరు చెరువులో…

Read More

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి…

53వ డివిజన్ భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆధ్వర్యంలో న‌గ‌రంలోని వెంకటేశ్వరపురం సెంటర్లో స్థానిక ప్రజలందరూ కలిసి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… సామూహిక నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నా అనంతరం 53వ డివిజన్ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ చైతన్యకు వినతి పత్రం సమర్పించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాలి… లేకుంటే ఉద్య‌మాలు చేప‌డుతాం అంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి…

Read More

మ‌హా ప‌డిపూజ‌లో మంత్రి నారాయ‌ణ‌

అయ్య‌ప్ప‌స్వామికి విశేష పూజ‌లు నిర్వ‌హించిన మంత్రి నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి అయ్యప్ప మహపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున…

Read More

వాకాడులో విషాదం…

పాముకాటుతో 14 ఏళ్ల పంటరంగం చరణ్ బాలుడు మృతి చెందిన ఘటన… తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో కుటుంబ స‌భ్యులు అత‌న్ని హుటాహుటిన‌ హాస్పిటల్ కు తరలించారు..హాస్పిటల్ లో చికిత్స పొందు మృతి చెందాడు. హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక సరైన మందులు లేక‌నే ..మా బిడ్డ చనిపోయాడని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. చ‌ర‌ణ్ బాలిరెడ్డిపాళెం జ‌డ్పీ హూస్కూల్‌లో ప‌దో…

Read More

సీఎంని కలిసిన వేమిరెడ్డి దంపతులు

ప్రశాంతి రెడ్డికి టిటిడి బోర్డు మెంబర్‌ గా అవకాశం కల్పించడంపై ధన్యవాదాలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా సీఎంని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు….

Read More

తొల‌గించిన ప్రైవేట్ హాస్పిట‌ల్స్ హోర్డింగ్‌లు…N3 ఎఫెక్ట్

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయ‌ప‌ల్లి మండ‌లంలో ప్ర‌మాద‌క‌రంగా హోర్డింగ్‌లు…భ‌యాందోళ‌న‌లో విద్యార్థులు, ప్ర‌యాణికులు అన్న క‌థ‌నాన్ని ఎన్‌3 న్యూస్ ప్ర‌చురించింది. ఈ క‌థ‌నానికి సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ముందు, బాలిక‌ల గురుకుల పాఠ‌శాల ప్రాంగ‌ణం ఎదుట ప్రైవేట్ హాస్పిటల్స్ యాజ‌మాన్యం పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌లు ప్ర‌మాద‌క‌రంగా మారాయ‌ని విద్యార్థులు, ప్ర‌యాణికులు తెలియ‌జేశారు. దీనిపై ఎన్‌3 న్యూస్ ప్ర‌తినిధి క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. క‌థ‌నం ప్ర‌సార‌మ‌వ‌డంతో సంబంధిత అధికారులు…

Read More