N3staff1

రాపూరులో కెమిక‌ల్ బ్లాస్టింగ్‌

వేస్ట్ మేనేజ్ మెంట్ ప్యాక్ట‌రీలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌… ఉమ్మ‌డి నెల్లూరు రాపూరు మండ‌లంలో చోటు చేసుకుంది. రావిగుంట‌ప‌ల్లిలోని వేస్ట్ మేనేజ్ మెంట్ ఫ్యాక్ట‌రీలో…కెమిక‌ల్ బ్లాస్టింగ్ జ‌ర‌గ‌డంతో… ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌ల‌తోపాటు…పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. డంపింగ్ యార్డులో ప్ర‌మాదం జ‌రిగింద‌ని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వాహ‌నాల్లో నుంచి డ్రైవ‌ర్లు దూసుకేసిన‌ట్లు స‌మాచారం. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని… మంట‌ల‌ను ఆర్పేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయినా మంట‌లు…

Read More

త‌న్నుకున్న తెలుగు త‌మ్ముళ్లు

ఓ స్థ‌ల వివాదంలో…మాజీ కార్పొరేట‌ర్‌, ప్ర‌స్తుత కార్పొరేట‌ర్ వ‌ర్గాలు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలో చోటు చేసుకుంది. ఈ దాడుల్లో… 53,54 క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జి జ‌హీర్ త‌ల‌కు తీవ్ర గాయాల‌వ‌డంతోపాటు…ఇరువ‌ర్గాల వారికి ర‌క్త‌పు గాయాల‌య్యాయి. దీంతో జ‌హీర్ ని ఆయ‌న అనుచ‌రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్‌కి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి అపోలోకు త‌ర‌లించారు. అలాగే ఈ దాడుల్లో ముజీర్ వ‌ర్గం అనుచ‌రులు కూడా గాయ‌ప‌డ్డారు. వారు…

Read More

ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఉదయగిరి జిల్లా ఉద్యమ గర్జన…!

హైస్కూల్ నుంచి బ‌స్టాండ్ వ‌ర‌కు భారీ ర్యాలీ మెట్ట ప్రాంతమైన ఉదయగిరి జిల్లా సాధనే లక్ష్యంగా ఉదయగిరిలో ఉధృతం చేశారు. జిల్లా సాధన సమితి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, షేక్ దస్తగిరి అహ్మద్ సారథ్యంలో ఉదయగిరిలో హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు భారీ జన సందోహం మధ్య జానపద కళాకారుల డప్పులతో ర్యాలీగా నిర్వ‌హించారు. అనంతరం బ‌స్టాండ్ వ‌ద్ద‌ మానవహారం చేప‌ట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ… ఏళ్ల తరబడి వివక్షకు…

Read More

ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జిలో డ్రైనేజీ నీళ్లు

నెల్లూరు న‌గ‌రం ఆత్మ‌కూరు బ‌స్టాండ్ అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద‌…భారీగా డ్రైనేజీ నీళ్లు చేరాయి. దీంతో అటుగా ప్ర‌యాణించే వాహ‌న‌దారులు, పాద‌చారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీళ్లు కావ‌డంతో భ‌య‌క‌రంగా దుర్వాస‌న వెద‌జ‌ల్లుతోంది. అటు వెళ్ల‌లేక ప్ర‌జ‌లు నర‌క‌యాత‌న ప‌డుతున్నారు. సాధార‌ణంగా చిన్న‌పాటి వ‌ర్షం కురిస్తేనే అండ‌ర్ బ్రిడ్జి స‌ముద్రాన్ని త‌ల‌పిస్తోంది. ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నా… సంబంధిత కార్పొరేష‌న్ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాహ‌న‌దారులు వాపోతున్నారు. వెంట‌నే కార్పొరేష‌న్ అధికారులు స్పందించి…అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద నిల్వ ఉన్న…

Read More

వింజ‌మూరులో పశుగణన సర్వే ప్రారంభం

ప‌శువుల సంఖ్య‌, రైతువారి డేటా సేక‌ర‌ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు 21 వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ప్రారంభించినట్లు వింజమూరు ఏరియా పశువైద్యాధికారి డాక్టర్. రఘునాధ్ రెడ్డి వెల్లడించారు. మండలంలోని ఉండే పశువులు సంఖ్యను, రైతువారి డేటా సమీకరించి ప్రతి గ్రామంలో ఎన్ని పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సర్వే వలన నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించి కులాలు వారీగా కేంద్ర, రాష్ట్ర…

Read More

అగ్ని ప్ర‌మాద‌మా..? ఆక‌తాయిల ప‌నా…?

నెల్లూరు న‌గ‌రంలోని డీఎంహెచ్‌వో కార్యాల‌య ప్రాంగ‌ణంలో…అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దోమల మందు, దోమలకు కాలువల్లో వేసే మడ్డి ఆయిల్ నిలువ ఉంచే పాత‌ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జ‌రిగింది. దీంతో భ‌వ‌నంలో నుంచి ద‌ట్ట‌మైన న‌ల్ల‌టి పొగ‌ల‌తో పాటు….మ‌డ్డి ఆయిల్ ఉండ‌డంతో పెద్ద ఎత్తున మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. డీఎంహెచ్‌వో కార్యాల‌యంలో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక ప్ర‌జ‌లు ఒక్క సారిగా భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులు ఘ‌ట‌నా స్థ‌లానికి…

Read More

చిట్టమూరులో విషాదం…

తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది… స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాల కోసం తీసిన గుంతలో మునిగి వీరేంద్ర సాయి (14) అనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు… పాఠశాల వదిలిన తర్వాత తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు.. ఇసుక తవ్వకాలు జరిపిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండడంతో వీరేంద్ర సాయి ఇసుకలో కూరుకుపోయి మునిగిపోయాడు.. మరో ముగ్గురు విద్యార్థులు క్షేమంగా…

Read More

కోరిన కోరికలు తీర్చే నాగేంద్ర స్వామి నాగుల పుట్ట…

కోవూరులో వైభవంగా నాగుల చవితి వేడుకలు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు NTS గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానంలో నాగుల చవితి పండుగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని నాగుల పుట్టలో పాలు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నాగుల పుట్టకు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసి ఉందని భక్తులు తెలిపారు. రావి చెట్టు యాప చెట్టు…

Read More

సూట్‌కేస్‌లో శ‌వం..!

ఖ‌ర్మ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌దంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజం .. కొద్ది గంట‌ల్లోనే ఓ తండ్రి, కూతురు విష‌యంలో నిరూపించింది.. న‌గ‌ల కోసం ఓ వృద్ధురాలిని అతి కిరాత‌కంగా చంపేశారు.. ఆమె శ‌వాన్ని సూట్ కేసులో పెట్టుకుని.. మాయం చేసేప‌నిలో ఊరుగాని ఊరు.. రాష్ట్రంగాని రాష్ట్రం వెళ్లి..పోలీసుల‌కు దొరికిపోయారు. అన్యంపుణ్యం ఎరుగని ఆ వృద్ధురాలిని కిరాత‌కంగా చంపేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. చెన్నైలో ప‌డేద్దామ‌నుకుని ఇలా.. పోలీసుల‌కు దొరికిపోవ‌డంతో ఖ‌ర్మ‌సిద్ధాంతం నిజ‌మ‌ని నిరూపించింది. ఈ హ‌త్య జ‌రిగిన…

Read More

వింజ‌మూరులో వైభ‌వంగా నాగుల చ‌వితి

నాగేంద్రుడికి భ‌క్తులు విశేష పూజ‌లు నెల్లూరు జిల్లా వింజ‌మూరు మండ‌లంలో నాగుల చ‌వితి పండుగ వైభ‌వంగా జ‌రిగింది. మండ‌లంలోని ఊటుకూరు ప్రాంతంలో నాగేంద్రు స్వామి పుట్ట‌కి భ‌క్తులు విశేష పూజ‌లు చేశారు. మ‌హిళలు పుట్ట చుట్టూ దారం చుట్టి ప్ర‌ద‌క్ష‌ణాలు చేసి…పాలుపోసి…స్వామి వారికి నైవేధ్యాలు స‌మ‌ర్పించారు. మహిళలు ఉపవాసాలు ఉంటూ నిండు మనుసుతో ఆ నాగేంద్రునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Read More