
కలిసి కావలిని అభివృద్ధి చేద్దాం..!
కావలి పట్టణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో, వివిధ సంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరంగా జరిగాయి. ఎటుచూసినా మువ్వన్నెల జెండా రెపరెపలాడుంది. విద్యార్థుల జాతీయ గేయాలాపనలతో, నృత్యాలతో, జాతీయ నాయకుల వేషధారణలతో అలరించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం, ఏరియా వైద్యశాల, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ముందుగా ఆర్డీవో శీనా…