n3staff

నెల‌క్యాస్ట్ క‌ర్మాగారంలో వ్య‌క్తి మృతి

తిరుపతి జిల్లా గూడూరు రెండో పట్టణ పరిధిలోని నెల క్యాస్ట్ కర్మాగారంలో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతిమృతి చెందాడు. మృతి చెందిన నెల్లూరు జిల్లా కోవూరు వాసిగా మల్లెల గోపికృష్ణ గా పోలీసులు గుర్తించారు. కోర్ బాక్స్ క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తల ఇరుక్కుని మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. దీనిపై గూడూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Read More

మాలల మహా గర్జనను జయప్రదం చేయండి

నవంబర్ 4వ తేదీన అల్లూరు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న మాలల మహా గర్జన సభను జయప్రదం చేయాలని అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర నాయకులు ముసలి నరేంద్ర, ఎల్లు సాల్మన్ రాజు కోరారు. ఈ మేరకు అల్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాలల కాలనీలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను విడగొట్టే ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు క్రిమిలేయర్ వంటి వాటిపై…

Read More

కాకాణిపై బాల‌య్య సైన్యం ఫైర్‌

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై… నెల్లూరు జిల్లా నంద‌మూరి బాల‌య్య సైన్యం అధ్య‌క్షుడు వై ర‌వి ఫైర్ అయ్యారు. నెల్లూరులోని ఆయ‌న నివాసంలో ఓ వీడియోను విడుద‌ల చేశారు. కాకాణిపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ‌ల‌ను విమ‌ర్శించే స్థాయి నీది కాద‌ని హిత‌వు ప‌లికారు. నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాల‌ని హెచ్చ‌రించారు. ఇంకా ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే విందాం…

Read More

కేసుల‌తో భ‌య‌పెట్ట‌లేరు

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం వడ్డిపాళెం గ్రామానికి చెందిన బండి చెంచయ్య కుంటుబానికి లక్ష రూపాయలను చెక్ ను ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యలతో కలిసి వైసీపీ నెల్లూరు జిల్లా ఇన్చార్జ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి చేతుల మీదగా అందజేశారు. లక్ష రూపాయలు దాతృత్వాన్ని అందించిన‌ పెళ్లకూరు మండలం సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని కాకాణి‌ అభినందించారు. చెంచయ్య మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయమని హైకోర్టు ఆదేశించినా పోలీసు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు….

Read More

డిసెంబ‌ర్ 6న జ్యోతుల గ్రామోత్స‌వం…

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో షార్ బస్టాండ్ సమీపంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అయ్యప్ప స్వామి జ్యోతిల మెట్ల పూజ 26వ వార్షికోత్సవ ఆహ్వాన క‌ర‌ప‌త్రాల ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ముందుగా క‌ర‌ప‌త్రాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ఉత్సవ కమిటీ నిర్వాహకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కారంచేటి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ… గత 25 సంవత్సరాలుగా ప్రతియేట అత్యంత వైభవోపేతంగా…

Read More

మంత్రి ఆనం చొర‌వ‌…తీరిన ప్ర‌ధాన స‌మ‌స్య‌

నెల్లూరు జిల్లా సంగంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ప్రధానమైన సమస్య తీరింది. చేజర్ల మండలం మాముడూరు గ్రామంలో కార్యక్రమానికి సంగం మీదుగా వెళ్తున్న మంత్రి ఆనంని స్థానిక టీడీపీ నాయకులు ఆపి రహదారిపై మురుగు నీటి సమస్య గురించి వివరించి ఆ దృశ్యాలను చూపించారు. వెంటనే స్పందించిన మంత్రి ….. ఆర్ &బి అధికారులతో ఫోన్లో మాట్లాడి రహదారిపై మురుగునీటి ఇబ్బందులను తొలగించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశించిన గంటలోనే ఆర్&బి అధికారులు రహదారిపై మురుగునీటిని…

Read More

పేడ దిబ్బలను తొలగించడి..గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి

గ్రామాలలో రోడ్లపై ఎరువు దిబ్బలు వేయడంపై నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీవో శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆయన నాగమాంబాపురం పంచాయతీలో పర్యటించారు.. సచివాలయం పక్కనే ఎరువు దిబ్బలను చూసి మండిపడ్డారు.. రెండు మూడు రోజుల్లో పేడ దిబ్బలను ఎత్తివేలని సూచించారు.. గ్రామాలలో స్వచ్ఛతపై దృష్టి సారించాలన్నారు.. ఈ సందర్భంగా గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్ ను పరిశీలించారు.. త్వరలో ఉపయోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు.. ఆయన వెంట మాజీ సర్పంచులు.. పెంచలయ్య, రాఘవరెడ్డి..వీఆర్వోలు, ఇంజనీరింగ్, వెటర్నరీ,…

Read More

చేనేత కార్మికుల‌కి అండ‌గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు

నెల్లూరు జిల్లా వింజ‌మూరులో జిల్లా హ్యాండ్లూమ్ అండ్ టెక్సటైల్ అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్, చేనేత శాఖ అభివృద్ధి అధికారిని మాధవిలతలు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు మండ‌లంలోని చేనేత కార్మికుల్ని క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం అందించే రాయితీని వారికి వివ‌రించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో చేనేత కార్మికుల‌కి రాయితీల అంద‌క‌పోవ‌డంతో కార్మికుల జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా త‌యారైంద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం చొర‌వ‌తో…హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స‌టైల్స్ రంగాల‌కు ఊర‌ట క‌లుగుతుంద‌ని చేనేత కార్మికుల‌కి తెలియ‌జేశారు. కేంద్ర‌, రాష్ట్ర…

Read More

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యువత భారతదేశంలోనే..

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువత కలిగిన దేశం భారతదేశమనీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీవో శ్రీహరి అన్నారు.. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సచివాల సిబ్బందితో నైపుణ్య గణన శిక్షణా కార్యక్రమం నిర్వహ‌ణ‌ జరిగింది.. యువతలో నైపుణ్యాలు గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పారు.. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో నైపుణ్య గణన సర్వే చేపట్టాలని సిబ్బందిని సూచించారు.. సర్వే చేయాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు.. సర్వేల్లో ప్రధానంగా విద్యార్థులు సామాజిక ఆర్థిక స్థితిగతులు ప్రస్తుతం…

Read More

గ్రామాలలో నిరక్ష్య‌రాశులను తగ్గించాలి

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల వెలుగు కార్యాలయంలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్, అడల్ట్ ఎడ్యుకేషన్ కన్వీనర్ యస్.మహమ్మద్ ఆజాద్, మండల ఎంపీడీవో భవాని, ఏపీఎం రాధారెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం మహమ్మద్ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ…. నిర‌క్ష్య‌రాశుల్ని అక్ష‌రాశ్యుల్ని చేయ‌డ‌మే ఉల్లాస్ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల వెలుగు కార్యాలయం ఈవోఏలు , సీసీలు, వాలంటీర్ టీచర్లు పాల్గొన్నారు.

Read More