n3staff

వర్గీకరణ వద్దు..ఐక్యతే ముద్దు…

ఎస్వీ వర్గీకరణ వద్దని… ఎస్సీలంతా కలిసి ఉండటమే ముద్దుగా ఉంటుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులో జరిగిన మాలల మహా గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎస్సీలను విడగొట్టాలన్న ప్రయత్నం చేస్తుందని విమ‌ర్శించారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఎస్సీ…

Read More

ఆ బాధ్య‌త మాతోపాటు అధికారుల‌పై ఉంది – ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఇప్పుడున్నది ప్రజల కోసం పనిచేస్తున్న మంచి ప్రభుత్వం అని…ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాతో పాటు అధికారులపై ఉందని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ప్రత్యేక ప్రజావిజ్ఞాపనల కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆర్డీవో నాగ సంతోష్ అనూష, మండ‌ల అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి ప్ర‌తీ ఒక్క‌రిని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించి స‌మ‌స్య‌ల‌పై ఆరా…

Read More

యోగి నారాయ‌ణ విగ్ర‌హ ప్ర‌తిష్ఠ శుభ‌ప‌రిణామం

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని చెరువు కట్ట వద్ద కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ సద్గురు యోగి నారాయణ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ…. కుప్పంలో శ్రీ యోగి నారాయణ విగ్రహన్ని కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్టించడం శుభపరిణామం అన్నారు. తెలుగుదేశం పార్టీ…

Read More

డెత్ స‌ర్టిఫికేట్ కావాలా..?నా కోరిక తీర్చు.. !!

తండ్రి డెత్ స‌ర్టిఫికేట్ కోసం ఓ గిరిజ‌న మ‌హిళ ఆరు నెల‌లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కాళ్లావేళ్లా ప‌డి వేడుకుంటున్నా.. మంజూరు చేయ‌కుండా.. ఏదో ఒక కొర్రి పెడుతూ.. చివ‌ర‌కు డెత్ స‌ర్టిఫికేట్ కావాలంటే.. వీడియో కాల్ చేయాలి.. అన్నీ చూపించాలి.. నా ద‌గ్గ‌ర‌కు రావాలి.. డ‌బ‌ల్ బెడ్రూం ఉంది.. కోరిక తీర్చు.. నీ ప‌ని చేసి పెడ‌తానంటూ ఓ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న వైనం ఇది.. అత‌డి విక్రుత చేష్ట‌ల‌కు.. లోలోన బాధ‌ప‌డుతూ…..

Read More

పోర్ట్ వ్య‌ర్ధాల‌తో విష‌పూరితంగా చెరువు…

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామం చెరువును విషపూరితం చేస్తున్న పోర్టు వ్యర్ధాలను అరికట్టాలని కోరుతూ… ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గూడూరు కమిటి, సీపీఎం, సీఐటీయూ ఆద్వర్యంలో గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు… కొందరు అక్రమార్కులు సంపాదనే ధ్యేయంగా పోర్టు నుండి విషపూరిత దుర్గంధమైన వ్యర్థాలను భారీ ఎత్తున డ్రమ్ముల్లో తీసుకువచ్చి కడివేడు చెరువు వద్ద పడవేస్తున్నారని , దీంతో చెరువు జలాలు విషతుల్యంగా మారుతున్నాయని అన్నారు…చెరువులో చేపలు, పశువులు…

Read More

ఏపీఎఫ్‌డీసీ ఎల్అండ్ఈ నూత‌న రాష్ట్ర క‌మిటీ ఎన్నిక‌

నెల్లూరు న‌గ‌రంలోని ఏఐటీయూసీ కార్యాల‌యంలో… ఆంధ్ర‌ప్ర‌దేశ్ అట‌వీ అభివృద్ధి కార్పొరేష‌న్ లేబ‌ర్ అండ్ ఎంప్లాయిస్ యూనియ‌న్ కార్మికుల రాష్ట్ర జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఏపీఎఫ్‌డీసీ ఎల్అండ్ఈ నూత‌న రాష్ట్ర క‌మిటీ ఎన్నిక జ‌రిగింది. రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షులుగా శంక‌ర్ కిషోర్‌, రాష్ట్ర అధ్య‌క్షులుగా దామా అంక‌య్య‌ల‌తోపాటు రాష్ట్ర ఉపాధ్యులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కోశాధికారి, క‌మిటీ స‌భ్యుల‌ను ఎన్నుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా ఏఐటీయూసీ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శంక‌ర్ కిషోర్‌, సీపీఐ మాజీ…

Read More

బిర‌ద‌వాడ స్మ‌శాన‌వాటిక‌లో క్లీన్ అండ్ గ్రీన్ ప‌నులు

తిరుప‌తి జిల్లా నాయుడుపేట‌లోని బిర‌ద‌వాడ హ‌రిజ‌న‌వాడ‌లోని స్మ‌శాన‌వాటిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజ‌య‌శ్రీ దృష్టికి హ‌రిజ‌న‌వాడ‌లోని స్మ‌శాన‌వాటిక‌లో నెల‌కొన్న దుస్థితిని 5వ డివిజ‌న్ ఇన్‌చార్జ్ ప‌న‌బాక గంగ‌రాజు తెలియ‌జేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే నెల‌వ‌ల మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను క్లీన్ అండ్ గ్రీన్ కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఈ క్ర‌మంలో 5వ డివిజ‌న్ ఇన్‌చార్జ్ ప‌న‌బాక గంగ‌రాజు ఆధ్వ‌ర్యంలో హ‌రిజ‌న‌వాడ‌లోని స్మ‌శాన‌వాటిక‌లో పేరుకుపోయి ఉన్న చెట్ల‌ను తొల‌గించి ప‌రిశుభ్ర‌త చేప‌ట్టారు. దీంతో బిర‌ద‌వాడ…

Read More

ప్రైవేట్‌బ‌స్‌లో అస‌లేం జ‌రిగింది?

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణం ముస్తాపురం గ్రామానికి చెందిన రమేష్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో క్లీనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31వ తేదీన ఇంటి నుంచి బయలుదేరి 1వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్నాడు. సాయంత్రం హైదరాబాద్ నుంచి ఏఎస్ పేట కు వస్తున్న బస్ క్లీనర్ బస్సులో ప్రయాణిస్తున్న గడ్డం రమేష్ మార్గమధ్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు బస్సు సిబ్బంది సమాచారం అందించారు. దీంతో కుటుంబ…

Read More

రూర‌ల్ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన కోటంరెడ్డి…

నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని పొట్టేపాలెం కలజు మీద బ్రిడ్జిని వెంటనే మంజూరు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించాలని…అధికారుల్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. నెల్లూరు రూరల్లో మూడు బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్నారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని… అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో మంజూరు అయ్యాయ‌ని…నేను పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో వాటిని ఆపేశార‌ని…

Read More

ఎంపీ అంటే లెక్క‌లేదా…అగౌరప‌రుస్తారా…

నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో…డీఆర్సీ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో వేదిక‌పై ఎంపీకి గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆయ‌న స‌భ నుంచి వెళ్లిపోయారు. వెంట‌నే ఎంపీ వేమిరెడ్డిని స‌ముదాయించేందుకు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు ప్ర‌య‌త్నించారు. నేను వెన‌క్కి రాలేన‌ని ఖ‌రాకండిగా చెప్పేసి జ‌డ్పీ నుంచి ఆయ‌న‌ వెళ్లిపోయారు. అక్క‌డే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి సైతం ఎంపీ వెంట వెళ్లిపోయారు.

Read More