కిడ్నాప్ కేసును చేధించిన బుచ్చి పోలీసులు..

11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు_ _మూడు కార్లు, మూడు కత్తులు స్వాధీనం_ _మీడియా సమావేశంలో సీఐ శ్రీనివాసులురెడ్డి వెల్లడి_

కిడ్నాప్ కేసును చేధించిన బుచ్చి పోలీసులు..

  • 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మూడు కార్లు, మూడు కత్తులు స్వాధీనం
  • మీడియా సమావేశంలో సీఐ శ్రీనివాసులురెడ్డి వెల్లడి


ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసును బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు చేధించారని సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు కార్లు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


కిడ్నాప్ కేసును బుచ్చిరెడ్డి పాళెం పోలీసులు ఛేదించారు. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకొని కిడ్నాప్ కు ఉపయోగించిన మూడు కార్లు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసులు రెడ్డి నిందితులను మీడియా ముందు హాజరు పరిచి కేసు వివరాలను వెల్లడించారు. ఫిర్యాదుదారుడు రమేష్, నిందితుడు సురేంద్రకు బెంగళూరులో ఎస్.ఎల్.వి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి ధూపాలు మరియు పూజ సామాగ్రి తయారి పరిశ్రమ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాపార లావాదేవీలలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తేయని చెప్పారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడుకు వెళుతున్న రమేష్ ను జిపిఎస్ ట్రాక్ ద్వారా రెండు కార్లలో అతనిని వెంబడించి కిడ్నాప్ చేశారని తెలిపారు. రొట్టెల పండుగను ముగించుకుని కొందరు గ్రామానికి వెళుతున్న యువకులు జరిగిన ఘటనపై 112 కు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ యువకులు వారిని ప్రశ్నిస్తే ఫైనాన్స్ వారు అని జవాబు ఇచ్చారని తెలిపారు. రమేష్ అనే వ్యక్తిని మదనపల్లి దగ్గర ఉన్న నిమ్మనపల్లి గ్రామంలోని ఓ తోటలో బంధించి ఉన్నారని వారు అక్కడి నుండి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. నిందితులను చాకచక్యంగా నెల్లూరు టౌన్ తల్ప గిరి కాలనీలో వద్ద అరెస్ట్ చేసామన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *