ప్రజలకి నాణ్యమైన సేవలు అందిస్తాం…

జూలూరుపాడు పీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే

ప్రజలకి నాణ్యమైన సేవలు అందిస్తాం…

  • జూలూరుపాడు పీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ డే ని జిపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వెంకటేశ్వరులు, తేజస్విని ఆసుపత్రి సిబ్బంది జెపిఆర్ ఫౌండేషన్ ఇడుపుల రాజు సత్కరించారు. ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ… నిత్యం గ్రామీణ ప్రాంతాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… చిన్న వయసులోనే జెపిఆర్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తంబళ్ల నరసింహారావు, కంచి పోగు నరసింహారావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *