కలెక్టర్ ఆనంద్ – ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 480 అర్జీలు
పిజిఆర్ఎస్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలి
- కలెక్టర్ ఆనంద్
- ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 480 అర్జీలు
వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ కార్తీక్, డిఆర్వో ఉదయభాస్కర్రావు, డిఆర్డిఎ పిడి నాగరాజకుమారి, జడ్పీ సిఇవో మోహన్రావు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 480 అర్జీలను ప్రజలు అందజేశారన్నారు. ఈ అర్జీలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ నిర్దిష్ట గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.