సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు వార్నింగ్
వెంకటగిరిలో ఆటో డ్రైవర్లకు రోడ్డు రవాణా భద్రతపై అవగాహన సదస్సు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
- సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఏడుకొండలు వార్నింగ్
- వెంకటగిరిలో ఆటో డ్రైవర్లకు రోడ్డు రవాణా భద్రతపై అవగాహన సదస్సు
తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో పట్టణంలోని ఆటో డ్రైవర్, కార్ డ్రైవర్లకు రోడ్డు ప్రమాద నివారణ అంశాలపై వెంకటగిరి సీఐ ఏవి రమణ, ఎస్సై జి ఏడుకొండలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ ఏవి రమణ మాట్లాడుతూ… మద్యం సేవించి, అతివేగంతో, పరిమితికి మించిన ప్రయాణికులతో ఆటోలు నడపడం నేరమన్నారు. ముఖ్యంగా లైసెన్సులు లేకుండా, సరైన ధృవపత్రాలు లేకుండా అతి వేగంతో ఆటోలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సదస్సులో ఆటో యూనియన్ సంఘం నాయకులు, ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్ యూనియన్ నాయకులు, కార్ల యాజమాన్లు, తదితరులు పాల్గొన్నారు.