మంత్రి లోకేష్ పై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఫైర్
అంధకారంలోకి విద్యా వ్యవస్థ
- టీచర్ల బదిలీలను ప్రహసనంగా మార్చిన కూటమి సర్కార్
- సర్కార్ తీరుపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆగ్రహం
రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహాసనంగా మార్చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బదిలీల్లో మ్యానువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయ లోకంను పచ్చిగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.