శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల
వింజమూరులో శంకర నేత్రాలయ కంటి వైద్య శిబిరం
- శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల
నెల్లూరు జిల్లా వింజమూరులోని స్థానిక వై ఆర్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో శంకర నేత్రాలయ కంటి వైద్య శిబిరాన్ని, శేగు సుబ్బారావు – నిర్మలదేవి దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విచ్చేసి నిర్వాహకులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ఆయన సందర్శించారు. పేదలకు అందించే వైద్య సేవల్ని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ….ఉదయగిరి నియోజకవర్గంలో పేదలకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని ఆయన కొనియాడారు. భవిష్యత్ లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొపెసర్ వైవి రామిరెడ్డి, రిటైర్డ్ డిఎంహెచ్ఓ మాసీలమణి, సర్పంచ్ సృజన, కన్వీనర్ రఘునాధ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.