పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
సిద్ధిపేట జిల్లా చాట్లపల్లి గ్రామంలో ఘటన
BMW కారు కొనివ్వలేదని…
- పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
- సిద్ధిపేట జిల్లా చాట్లపల్లి గ్రామంలో ఘటన
తన తల్లిదండ్రులు బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన…సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు… గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య కుమారుడు బొమ్మ జాని(21)గత కొద్ది రోజులుగా బీఎండబ్ల్యూ కారు కొనియ్యాలని…లేకపోతే తాను చనిపోతానని తరచూ ఇంట్లో గొడవ పడేవాడు. కుటుంబ సభ్యులు తమ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని సర్ది చెప్పినప్పటికీ మృతుడు పదేపదే కారు కొనియ్యాలని ఇబ్బందికి గురి చేశారు. దీంతో తల్లిదండ్రులు సిద్దిపేటలోని కారు షోరూంకు వెళ్లి మారుతి స్విఫ్ట్ డిజైర్ కొనిస్తామని తండ్రి చెప్పాడు. మారుతి కారు వద్దని…నాకు బీఎండబ్ల్యూ కారు ఇష్టమని…అది తీసియకపోవడంతో మనస్థాపం చెందిన యువకుడు గత శుక్రవారం తన వ్యవఃఃసాయ పొలం వద్ద పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు యువకుని చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడనుండి మెరుగైన చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.