వైసిపి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు
కావలి టీడీపీ నేతల ఆరోపణలకు జవాబు ఇచ్చేందుకు రెడీ
మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రజలకే వెన్నుపోటు పొడిచారు…
- వైసిపి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
- నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు
- కావలి టీడీపీ నేతల ఆరోపణలకు జవాబు ఇచ్చేందుకు రెడీ
- మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు
వైసీపీ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కావలిలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాల అమలుకు కుంటి సాకులు చెబుతున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కావలిలో తన నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. 4వ తేదీన వైసిపి వెన్నుపోటు దినంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తమ నిరసన కార్యక్రమానికి కావలి పోలీసుల అనుమతి కోరినా ఇవ్వలేదన్నారు. మంగళవారం టీడీపీ నాయకులు వైసిపి విధ్వంసం అంటూ కావలిలో కార్యక్రమం చేస్తున్నారని, వారి ఆరోపణలకు బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.