ప్రజల ప్రాణాలతో చెలగాటమొద్దు

నివాసాల వద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయద్దు

సూళ్లూరుపేట కమిషనర్ ను కలసిన కొన్నెంబట్టు గ్రామస్థులు

ప్రజల ప్రాణాలతో చెలగాటమొద్దు…

  • నివాసాల వద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయద్దు
  • సూళ్లూరుపేట కమిషనర్ ను కలసిన కొన్నెంబట్టు గ్రామస్థులు


కొన్నెంబట్టులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి గ్రామస్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని ప్రజలు తెలిపారు. వెంటనే డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకోవాలని గ్రామస్థులు సూళ్లూరుపేట కమిషనర్ చిన్నయ్యని వినతి పత్రం అందచేశారు.


తిరుపతి జిల్లా సూళ్లూరుపేటల మండల పరిధిలోని కొన్నెంబట్టు గ్రామానికి చెందిన గ్రామస్థులు కమిషనర్ కే చిన్నయ్యని కలిశారు. కొన్నెంబట్టు గ్రామ సరిహద్దులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనపై వారు అభ్యంతరం తెలియజేశారు. గ్రామంలో సుమారు వంద సంవత్సరాలుగా 500 కుటుంబాలు నివసిస్తున్నాయని అన్నారు. ఇక్కడి భూగర్భ జలాల్లో కలుషిత ఉండటంతో చాలామంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారన్నారు. ఇప్పటికే ఆరోగ్యపరంగా కొంతమంది చనిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నరనీ, ఇప్పుడు డంపింగ్ యార్డ్‌ను తమ గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటుని విరమించుకోవాలని కమిషనర్ కు విన్నవించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *