వనంతోపులో అట్టహాసంగా 5వ బ్రాంచ్ ప్రారంభోత్సవం
ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
మౌంట్ లిటేరలో విలువలతో కూడిన విద్య
- వనంతోపులో అట్టహాసంగా 5వ బ్రాంచ్ ప్రారంభోత్సవం
- ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
విలువలతో కూడిన విద్యను అందిస్తోన్న మౌంట్ లిటేర స్కూల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ కోరారు. వనంతోపులో స్కూల్ ఐదవ బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు.
చక్కని విద్య ప్రమాణాలతో విద్య బోధనతోపాటు విద్యార్థులకి అవసరమైన అన్నీ విధాలా శిక్షణ ఇస్తున్న మౌంట్ లిటేర స్కూల్ ఐదో బ్రాంచ్ విజయవంతంగా ముందుకెళ్లాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు నగరం బీవీ నగర్లో మౌంట్ లిటేర గ్రూఫ్ స్కూల్స్ ఐదో బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరస్పాండెంట్ ధనరాజ్ తో కలసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… విలువలతో కూడిన విద్యను అందిస్తోన్న మౌంట్ లిటేర స్కూల్ ను బీవీ నగర్ సమీప వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరస్పాండెంట్ ధనరాజ్ మాట్లాడుతూ… క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు మౌంట్ లిటేర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా బీవీ నగర్ ప్రాంతంలో స్కూల్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఈ ఈ కార్యక్రమంల అడకమిక్ కో ఆర్డినేటర్ దినేష్ కుమార్, ప్రిన్సిపాళ్లు రూపశ్రీ, మంజు, వీఎస్ ప్రభ, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.