తప్పిన పెను ప్రమాదం

ఆరు ఎకరాల గడ్డివామి దగ్దం – రూ. 50 వేలు ఆస్తినష్టం

తప్పిన పెను ప్రమాదం
ఆరు ఎకరాల గడ్డివామి దగ్దం..
రూ. 50 వేలు ఆస్తినష్టం.

నెల్లూరు జిల్లా….సంగం మండలకేంద్రంలోని ఎర్ర చెరువు సమీపంలో పోలిశెట్టి కృష్ణయ్య అనే రైతుకు సంబంధించి ఆరు ఎకరాలు గడ్డివామి అగ్నికి ఆహుతి అయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆత్మకూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.చుట్టుపక్కల ఇల్లులు ఏమి లేకపోవడంతో పెనుప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..లేక ఎవరైనా తగలబెట్టారా అని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షుమారు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని భాదితులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *