ప్రజల కోసమే మార్పు

ఇక నుంచి పారదర్శకంగా రేషన్ సరుకులు పంపిణీ

రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి

మూలాపేటలోని రేషన్ షాపులో సరుకుల పున: ప్రారంభాన్ని సందర్శించిన పట్టాభి,జేసీ కార్తీక్

ప్రజల కోసమే మార్పు…

  • ఇక నుంచి పారదర్శకంగా రేషన్ సరుకులు పంపిణీ
  • రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి
  • మూలాపేటలోని రేషన్ షాపులో సరుకుల పున: ప్రారంభాన్ని సందర్శించిన పట్టాభి,జేసీ కార్తీక్


నిరుపేదలందరికి నాణ్యమైన సరుకులు అందించాలన్న మంచి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారానే సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ డైరెక్టక్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేర్కొన్నారు. మూలాపేటలోని రేషన్ షాపులో సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జేసీ, డీఎస్వోలతో కలసి విజిట్ చేశారు. రేషన్ కార్డుదారులకి నిత్యవసర సరుకులు అందచేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వతేదీ రేషన్ షాపుల ద్వారానే నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా… నెల్లూరు నగరం మూలాపేట రాజావీధిలోని రేషన్ షాపుని…జేసీ కార్తీక్, డీఎస్వో విజయ్ కుమార్ రెడ్డిలతో కలసి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విజిట్ చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి సరుకుల పంపిణీని పున: ప్రారంభించి రేషన్ కార్డుదారులకి సరుకులను అందచేశారు. అనంతరం వేమిరెడ్డి మాట్లాడుతూ…. ప్రజలందరూ డబుల్ పాలిష్ బియ్యాన్ని కాకుండా ఆరోగ్యకరమైన రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిరుపేదల కోసమే సీఎం చంద్రబాబు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ…ఈ రోజు నుంచి రేషన్ కార్డులందరూ రేషన్ డీలర్ షాపుల వద్దనే సరుకులు తీసుకోవాలని కోరారు. అలాగే రేషన్ కార్డులో చేర్పులు, మార్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *