_ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాం
సీఎం చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడు
3వ డివిజన్లో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ
ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ…
- ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాం
- సీఎం చంద్రబాబు సమర్ధవంతమైన నాయకుడు
- 3వ డివిజన్లో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ
ఎన్నికల్లో ఇచ్చిన మాటని సీఎం చంద్రబాబునాయుడు నిలబెట్టుకుంటున్నారని మంత్రి నారాయణ తెలిపారు. మూడో డివిజన్లో ఆయన లబ్ధిదారుల ఇంటింటికెళ్లి పెన్షన్లు అందచేశారు.
రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పండుగలా పెన్షన్ ల పంపిణీ సాగుతోందని మంత్రి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం మూడో డివిజన్ జాఫర్ సాహెబ్ కాలువ గట్టుపై పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆయనకి స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన లబ్దిదారుల ఇంటింటికెళ్లి పెన్షన్ నగదు అందచేశారు. దీంతో పెన్షన్ దారులు ఆనందంలో మునిగిపోయారు. పెన్షన్ దారుల యోగక్షేమాలను ఆయన అడిగితెలుసుకొన్నారు. తమ పిల్లలను వీఆర్ హై స్కూల్ లో చేర్పించాలని పేరెంట్స్ కు మంత్రి సూచించారు. స్కూల్ లో కల్పించే సదుపాయాలపై చిన్నారులకు వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పెన్షన్ 4 వేలు చేస్తామని ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారన్నారు. ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్నామని గుర్తు చేశారు. మానిఫెస్టో లో చెప్పినవన్నీ వందశాతం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 12 న తల్లికి వందనం అమలు చేస్తామని తల్లులకి ఆయన శుభవార్త చెప్పారు. కార్యక్రమంలో కమిషన్ నందన్, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.