సంకెళ్లతో వైసీపీ నేతలు నిరసన..

వైసీపీ నేతల అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం

మీడియా సమావేశంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు

సంకెళ్లతో వైసీపీ నేతలు నిరసన…

  • వైసీపీ నేతల అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం
  • మీడియా సమావేశంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు

కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. డైవర్షన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందని…వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా…చేతికి నల్ల వస్త్రాలు సంకెళ్లుగా వేసుకొని నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగార్జున మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి.. ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ.. పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు.. బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *