28 మందితో బ్రహ్మోత్సవ సేవా కమిటీ నియామకం
బ్రహ్మోత్సవాల విజయవంతానికి అందరూ సహకరించాలి
జూన్ 2 నుంచి 13 వరకు
గంగపట్నం చాముండేశ్వరి బ్రహ్మోత్సవాలు
- 28 మందితో బ్రహ్మోత్సవ సేవా కమిటీ నియామకం
- బ్రహ్మోత్సవాల విజయవంతానికి అందరూ సహకరించాలి
జూన్ 2 నుంచి 13వ తేదీ వరకు గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కార్య నిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తెలిపారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సహకారంతో 28 మందిని బ్రహ్మోత్సవ కమిటీ
జూన్ 2వతేదీ నుంచి 13వ తేదీ వరకు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ కార్య నిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ….రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిల సహకారంతో 28 మందితో బ్రహ్మోత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంగపట్నం పంచాయతీ వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ…ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.