కావలి మండల రేషన్ డీలర్లతో తహశీల్దారు శ్రావణ్ కుమార్ సమావేశం
రేషన్ పంపిణీలో విధి విధానాలపై పలు సూచనలు
రేషన్ డీలర్లు ఇవి పాటించాల్సిందే..
- కావలి మండల రేషన్ డీలర్లతో తహశీల్దారు శ్రావణ్ కుమార్ సమావేశం
- రేషన్ పంపిణీలో విధి విధానాలపై పలు సూచనలు
కావలి పట్టణ, మండల రేషన్ డీలర్లు వారి దుకాణాల వద్ద సరుకుల నిల్వలు తెలిపే బోర్డులు కచ్చితంగా ఏర్పాటు చేయాలని కావలి తహశీల్దారు శ్రావణ్ కుమార్ ఆదేశించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమావేశం అయ్యారు. దుకాణాల వద్ద పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. రేషన్ డీలరు ల్యామినేషన్ ఫోటో అక్కడ ఉండాలన్న ఏర్పాటు చేసిన బోర్డులలో ఏరోజుకు ఆరోజు నిల్వల సమాచారం నమోదు చేసి ఉండాలన్నారు. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ అధికారుల అనుమతి పత్రాన్ని
దుకాణం వద్ద చూపాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డిటి మురళీధర్ రాజు, ఆర్ ఐ మోహన్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ రావు, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ విజయలక్ష్మి పాల్గొన్నారు.