మహానాడు రవాణా కమిటీ సమావేశంలో మంత్రి నారాయణ
రవాణా సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకూడదు
- మహానాడు రవాణా కమిటీ సమావేశంలో మంత్రి నారాయణ
కడపలో కొనసాగుతున్న మహానాడుకు వెళ్లే టీడీపీ నేతలు, కార్యకర్తలకు రవాణా సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహానాడు రవాణా కమిటీ కన్వీనర్, మంత్రి నారాయణ సూచించారు. కడపలో ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్, అధికారులు, టీడీపీ ముఖ్య నేతలతో ఆయన సమీక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పార్టీ నేతలకు బస్సులు సమకూర్చడం, భోజన వసతి, తాగునీరు తదితర సౌకర్యాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మహానాడు రవాణా కమిటీ సభ్యుల్ని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి,
నేతలు పాల్గొన్నారు.