నేటి వార్తా మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు సంచ‌ల‌నం రేపే క‌థ‌నాలు

కడపలో రాష్ట్ర మహానాడు కార్యక్రమం రెండో రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సామూహిక యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్, జేసీ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరి చేత యోగా గురువులు యోగాసనాలు చేయించారు. ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102 జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వైసీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యారు. తాజా పరిణామాలపై కాకాణితో చర్చించినట్లు పర్వతరెడ్డి తెలిపారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై 307 కేసులు కట్టడం, సప్తసముద్రాలు ఈది మురికి గుంటలో చచ్చినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు

ఓ వ్యక్తిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందాడు. మృతుడు సంగం మండలం చెన్నవరప్పాడుకు చెందిన గొల్లపల్లి శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు.

భారీ కంటైనర్లో అక్రమంగా తరలిస్తోన్న రూ. 4 కోట్ల 15 లక్షల విలువైన నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సినిమా ధియేటర్లను ఆర్డీవోలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. థియేటర్ల అనుమతులు, సేఫ్టీ, సీటింగ్, క్యాంటీన్, మరుగుదొడ్ల శుభ్రత, తినుబండారాలు, డ్రింక్స్ అమ్మకాలు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *