కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో యోగా శిక్షణా తరగతులు
మండలంలో అందరూ ఉద్యోగులు, సిబ్బంది శిక్షణా తరగతులకు హాజరుకావాలి
కార్యక్రమ విధివిధానాలు వివరించిన ఎంపిడిఓ ఆదినారాయణ
యోగా శిక్షణా తరగతులు…
- కొండాపురం మండల పరిషత్ కార్యాలయంలో యోగా శిక్షణా తరగతులు
- మండలంలో అందరూ ఉద్యోగులు, సిబ్బంది శిక్షణా తరగతులకు హాజరుకావాలి
- కార్యక్రమ విధివిధానాలు వివరించిన ఎంపిడిఓ ఆదినారాయణ
యోగా శిక్షణా తరగతులకు మండలంలోని అందరూ ఉద్యోగులు, సిబ్బంది హాజరు కావాలని ఎంపీడీవో ఆదినారాయణ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమ విధి విధానాలను ఆయన వివరించారు.
కొండాపురం మండలంలో జరిగే యోగా శిక్షణా తరగతులకు మండలంలో అందరూ ఉద్యోగులు, సిబ్బంది విధిగా హాజరు కావాలని ఎంపీడీవో ఆదినారాయణ తెలిపారు. మంగళవారం యోగా శిక్షణా తరగతుల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజలందరూ యోగాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. త్వరలో ప్రధాని మంత్రి మోదీతో కలిసి యోగా చేసే విధంగా ప్రజలకు అవగాహన పెంపొంచాలన్నారు. ఇందుకోసం ఉద్యోగులు, సిబ్బంది ముందుగా నేర్చుకుని మీ ప్రాంతాల్లో యోగాపై చైతన్యం తేవాలని సూచించారు.