ప్రజారోగ్యంపై కూటమి ప్రత్యేక శ్రద్ధ

శ్రీ కాళహస్తి అక్కుర్తి గ్రామంలో

ప్రజారోగ్యంపై కూటమి ప్రత్యేక శ్రద్ధ

  • శ్రీ కాళహస్తి అక్కుర్తి గ్రామంలో


ప్రజారోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ తెలిపారు. కాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలోని హైస్కూల్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.


శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలోని హైస్కూల్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఈటీ మాస్టర్, మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ, గ్రామ పంచాయతీ సెక్రటరీ లీలావతి, గ్రామ పంచాయతీ హెల్పర్ ఎడ్యుకేషన్ లీలా హనుమంతరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు యోగాసనాలు చేసి యోగాంధ్రపై అవగాహన కల్పించారు. అనంతరం మాస్టర్ ఆఫ్ యోగా ట్రైనర్ గోపాలకృష్ణ ఎన్3 న్యూస్ తో మాట్లాడారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉండాలన్న లక్ష్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని చెప్పారు. ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా యోగాసనాలు వేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామాల సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *