నెల్లూరు కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన పోలీసులు
కాకాణి కోసం భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు
జైలు వద్ద గట్టి పోలీసు బందోబస్తు
రాజకీయ కక్షతోనే కాకాణి అరెస్ట్ – పేర్నాటి శ్యాం ప్రసాద్
సాధారణ రిమాండ్ ఖైదీగా కాకాణి…
- నెల్లూరు కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన పోలీసులు
- కాకాణి కోసం భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు
- జైలు వద్ద గట్టి పోలీసు బందోబస్తు
- రాజకీయ కక్షతోనే కాకాణి అరెస్ట్ – పేర్నాటి శ్యాం ప్రసాద్
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు. కాకాణి స్పెషల్ కేటగిరి పిటిషన్ను వెంకటగిరి కోర్టు హోల్డ్ లో పెట్టింది. ఫిటిషన్ పెండింగ్ లో ఉండడంతో సాధారణ రిమాండ్ ఖైదీగానే కాకాణిని జైల్లోకి తీసుకెళ్లారు.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య వెంకటగిరి కోర్టు నుంచి నెల్లూరు కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారు. ప్రొసీజర్ పూర్తి చేసి జైలు లోపలకు జైలు అధికారులు తీసుకెళ్లారు. కాకాణి స్పెషల్ కేటగిరి పిటిషన్ను వెంకటగిరి కోర్టు హోల్డ్ లో పెట్టింది. స్పెషల్ కేటగిరి ఫిటిషన్ పెండింగ్ లో ఉండడంతో సాధారణ రిమాండ్ ఖైదీగానే కాకాణిని జైల్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి కాకాణి కోసం వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని పరామర్శించేందుకు వైసీపీనేత పేర్నాటి శ్యాం ప్రసాద్ జైలు వద్దకు వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వైసిపి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని రాజకీయ కక్ష తోనే అరెస్ట్ చేశారన్నారు. కచ్చితంగా ఇది రాజకీయ కుట్ర అన్నారు. చట్ట పరంగా ముందుకు వెళుతామని… కచ్చితంగా బెయిల్ వస్తుంది అని నమ్ముతున్నామన్నారు.