మాకు న్యాయం కావాలి

కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత కుటుంబం డిమాండ్

వ్యవస్థలన్నీ కబ్జాకోరుకే మద్దతుగా నిలుస్తున్నాయని ఆవేదన

మంత్రి నారా లోకేష్ కు ఇచ్చిన విజ్ఞాపనకు తప్పుడు నివేదికలు

మాకు న్యాయం కావాలి…

  • కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత కుటుంబం డిమాండ్
  • వ్యవస్థలన్నీ కబ్జాకోరుకే మద్దతుగా నిలుస్తున్నాయని ఆవేదన
  • మంత్రి నారా లోకేష్ కు ఇచ్చిన విజ్ఞాపనకు తప్పుడు నివేదికలు


తమ భూమిని అన్యాయంగా ఆక్రమించారని దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


అయ్యా మా భూమిని ఆక్రమించారని, నకిలీ పత్రాలతో రికార్డులు తారుమారు చేశారని వేడుకుంటున్నా… మా గోడు ఆలకించేవాడేలేడని, చివరకు ఉన్నతస్థాయి అధికారులు, నాయకులైనా సమస్యను పరిష్కరిస్తారని చూస్తే వారికీ తప్పుడు నివేదికలు పంపిస్తూ అన్యాయం చేస్తున్నారని కావలి పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద వారు ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాతో గడ్డం తిరుపతి, కుమారుడు గడ్డం వంశీ లు మాట్లాడారు. బోగోలు మండలం అల్లిమడుగు పంచాయితీ , తెల్లగుంట గ్రామానికి చెందిన గడ్డం తిరుపయ్యకు చెందిన 10 ఎకరాల భూమి ఉందని, 4 ఎకరాల భూమిని వారి వారసులు గడ్డం కుమారికి రాసిచ్చారన్నారు. ఈ భూమిని సన్నిగుంట శీనయ్య 2020లో ఆక్రమించినట్లు తెలిపారు. కొందరు అధికారుల సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించారన్నారు. మంత్రి లోకేష్ ను , కలెక్టర్ నీ కలిస్తే ఆర్వోఆర్ ఫైల్ చేయమని ఆర్డీఓకు తెలియజేశారన్నారు. ఆర్డీఓ ఎలాంటి సర్వే చేయకుండా ముఖ్యమంత్రికి , లోకేష్ కు తప్పుడు సమాచారం పంపారన్నారు. మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *