మంత్రి ఆనం
మూడు రోజులు పసుపు పండుగ…
- మీడియా సమావేశంలో మంత్రి ఆనం
కడపలో మూడు రోజులు పసుపు పండుగ జరుగుతుందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.